స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 62,834 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,701 వద్ద ముగిసింది. మెటల్ స్టాక్ ల్లో పెరుగుదల కనిపించింది. బ్యాంక్, యాల్టీ స్టాక్ లు రాణించాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా స్టాక్ లు కూడా లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, టాటా స్టీల్, యూపీఎల్లు అత్యధికంగా లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, రిలయన్స్ ఎక్కువగా నష్టపోయాయి.

ఆర్బీఐ
ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం ప్రారంభమైంది. అటు డాలరు మారకంలో రూపాయి 58 పైసలు పడిపోయి 81.79 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 81.32 తో పోలిస్తే సోమవారం స్వల్పంగ నష్టపోయిన రూపాయి ఆతరువాత మరింత పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలలో 1.4 శాతం పెరుగుదల కారణంగా రూపాయి సోమవారం కుప్పకూలింది.

వాల్ స్ట్రీట్
శుక్రవారం వాల్ స్ట్రీట్లో మిశ్రమ ముగింపు తర్వాత.. US ద్రవ్యోల్బణం డేటా విడుదల, వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. టోక్యో Nikkei ఇండెక్స్ సోమవారం అధిక స్థాయిలో ముగిసింది. బెంచ్మార్క్ Nikkei 225 ఇండెక్స్ 0.15% వరకు ముగిసే ముందు రోజులో హెచ్చుతగ్గులకు లోనైంది, అయితే విస్తృత Topix ఇండెక్స్ 0.31% పడిపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగింది.

ఎస్బీఐ
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 1.6 శాతం పెరిగింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ స్టాక్ పెరిగింది. బలమైన కొనుగోళ్లతో రూ.616.70 వద్ద ముగిసింది. తొలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. ఏ దేశీయ రుణదాత చేసిన అతిపెద్ద సింగిల్-ఇన్ఫ్రా బాండ్ విక్రయం ఇదే.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications