కరోనా నేపథ్యంలో ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడు ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వలస కార్మికుల నుండి నగదు బదలీ పెరగడం, ఉద్యోగంలో చేరాక ఈపీఎఫ్ఓ నమోదులు లాక్డౌన్ ముందుస్థాయికి చేరుకోవడం, జన్ధన్ ఖాతాల్లో నగదు జమ వృద్ధి వంటివి ఇందుకు నిదర్శనమని ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ప్రభుత్వంతో పాటు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ కూడా ఆర్థిక రికవరీ సంకేతాలు స్పష్టంగా ఉన్నట్లు తెలిపాయి.

కరోనా ముందుస్థాయికి రెమిటెన్స్
కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో వలస కార్మికుల రెమిటెన్సెస్ భారీగా తగ్గాయి. జూన్, జూలై నెలల్లో కాస్త పెరిగినప్పటికీ ఆశాజనకంగా కనిపించలేదు. సెప్టెంబర్ నెలలో అయితే కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. అంటే ఫిబ్రవరి నెలస్థాయికి చేరాయి. దీనిని బట్టి కార్మికులు తిరిగి పెద్ద ఎత్తున పనుల్లో చేరుతున్నారని భావించవచ్చు. ఆగస్ట్ నెలలో వర్షాల వల్ల రెమిటెన్సెస్ కాస్త తగ్గాయి.

ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పేరోల్ డేటా ప్రకారం ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో కొత్తగా 25 లక్షల ఈపీఎఫ్ చందాదారులు చేరారు. ఇందులో 12.4 లక్షలమంది తొలిసారి వేతనం అందుకుంటున్నవారు కావడం గమనార్హం. 2019-20లో 110.4 లక్షల కొత్త ఈపీఎఫ్ చందాదారులు చేరారు. అంతకుముందు ఏడాది ఇది 139.4 లక్షలుగా ఉంది. అంటే 29 లక్షలు తక్కువ. ఫార్మలైజేషన్ డిగ్రీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతానికి గణనీయంగా పడిపోయింది. ఇది అంతకుముందు ఏడాది 11 శాతంగా ఉంది.

పెరిగిన జన్ ధన్ ఖాతాలు
అక్టోబర్ 14వ తేదీ నాటికి జన్ ధన్ ఖాతాలు 41.05 కోట్లుగా ఉండగా, వాటిలో జమ అయిన మొత్తం రూ.1.31 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ నుండి దాదాపు 3 కోట్ల ఖాతాలు తెరవగా, మొత్తం డిపాజిట్ల వృద్ధి రూ.11,060 కోట్లుగా ఉంది. కరోనా కారణంగా ఈ ఖాతాల సంఖ్య అరవై శాతం పెరిగింది. ఏప్రిల్లో సగటు జమ రూ.3400కు పెరగగా, సెప్టెంబర్ నాటికి రూ.3,168కి తగ్గింది. అక్టోబర్లో తిరిగి రూ.3,185కు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం మహిళల అకౌంట్లలో రూ.500 చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. జన్ ధన్ ఖాతాల వల్ల యూపీ, మహారాష్ట్ర, హర్యానాలలో నేరాలు తగ్గాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications