ముంబై: వరుసగా రెండు రోజుల పాటు భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 19, మంగళవారం) కోలుకున్నాయి. నేటి ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 359.64 పాయింట్లు లేదా 0.74% లాభపడి 48,923.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.10 పాయింట్లు లేదా 0.70% ఎగిసి 14,381.40 పాయింట్ల వద్ద ఉంది. 999 షేర్లు లాభాల్లో, 232 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 28 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా లాభపడింది. 11 పైసలు ఎగబాకి 73.17 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.28 వద్ద క్లోజ్ అయింది.

నేడు భారీగా జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 48,900 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత అంతకంతకూ ఎగిసింది. ఏ దశలోను క్షీణించలేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి 650 పాయింట్లు లాభపడి 49,215 పాయింట్ల వద్ద ఉంది. 49,237 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,805 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 48,564 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గత రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత వారం చివరి సెషన్లో (శుక్రవారం) 550 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నిన్న 470 పాయింట్లు పతనమైంది. నేడు 650 పాయింట్ల వరకు ఎగిసిపడటం గమనార్హం. నిఫ్టీ 190 పాయింట్ల వరకు లాభపడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 4.59 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.64 శాతం, బజాజ్ ఫైనాన్స్, 3.97 శాతం, టాటా మోటార్స్ 3.46 శాతం, లార్సన్ 3.18 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 0.76 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.37 శాతం, బ్రిటానియా 0.33 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.24 శాతం లాభపడి రూ.2,028 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. చాలా రోజుల తర్వాత రిలయన్స్ రూ.2000 మార్కును క్రాస్ చేసింది.
ఐటీ రంగానికి వస్తే ఇన్ఫోసిస్ 0.61 శాతం, టీసీఎస్ 1.08 శాతం, విప్రో 0.22 శాతం, HCL టెక్ 0.056 శాతం లాభపడ్డాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.28 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.24 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.43 శాతం, నిఫ్టీ ఆటో 1.43 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.42 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.51 శాతం, నిఫ్టీ ఐటీ 0.64 శాతం, నిఫ్టీ మీడియా 2.05 శాతం, నిఫ్టీ మెటల్ 1.66 శాతం, నిఫ్టీ ఫార్మా 0.93 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.52 శాతం, నిఫ్టీ రియాల్టీ 4.16 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.12 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications