ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 12) నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడింది. ఉదయం నుండి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ భారత్ 3.0 పేరిట ఉద్దీపనలు ప్రకటించారు. ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. ఎనిమిది రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారంలో మొదటి మూడు సెషన్లలో రికార్డులు నెలకొల్పింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యూప్ సూచీలు 0.5 శాతం చొప్పున ఎగిశాయి. కానీ ఈ రోజు సూచీలు నష్టపోయాయి.

మార్కెట్ను ఆదుకోని నిర్మల ప్యాకేజీ
నేడు సెన్సెక్స్ 236.48 పాయింట్లు(0.54%) నష్టపోయి 43,357.19 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58.40 పాయింట్లు(0.46%) నష్టపోయి 12,690.80 వద్ద ముగిసింది. 1531 షేర్లు లాభాల్లో, 1117 షేర్లు నష్టాల్లో ముగియగా, 185 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
డాలర్ మారకంతో రూపాయి 74.66 వద్ద క్లోజ్ అయింది. రూపాయి 74.44 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 74.37 వద్ద క్లోజ్ అయింది.
నిర్మలా సీతారామన్ భారీ ప్యాకేజీ మార్కెట్లకు ఏమాత్రం ఊతమివ్వలేకపోయింది.
నష్టాల్లో ముగిసినప్పటికీ సెన్సెక్స్ 43వేల పాయింట్లకు పైనే ఉంది. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సమయంలో నేటి కనిష్టం 43,136కు పడిపోయింది.

రిలయన్స్ మళ్లీ పతనం
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 2.97 శాతం, HUL 2.86 శాతం, శ్రీసిమెంట్స్ 2.51 శాతం, హిండాల్కో 2.23 శాతం, ఐటీసీ 1.46 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో SBI 3.16 శాతం, కోల్ ఇండియా 2.98 శాతం, కొటక్ మహీంద్ర 2.94 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.38 శాతం, ఎన్టీపీసీ 2.26 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2000 దిగువన ట్రేడ్ అయింది. రిలయన్స్ షేర్ నేడు ఓ సమయంలో రూ.2,005ను తాకింది. ఆ తర్వాత ఏ దశలోను రూ.2000 మార్కును చేరుకోలేదు. నిన్న రూ.1997 వద్ద క్లోజ్ కాగా, నేడు 0.77 శాతం క్షీణించి రూ.1982 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా...
టాప్ 10 నిఫ్టీ లూజర్స్లో 6 ఫైనాన్షియల్స్ కావడం గమనార్హం. ఎస్బీఐ, కొటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ 566 పాయింట్లు నష్టపోయి 28,279 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 108 పాయింట్లు నష్టపోయి 18,183 వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ ఆటో 0.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.28 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.66 శాతం, నిఫ్టీ ఫార్మా 0.26 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.74 శాతం లాభాల్లో క్లోజ్ అయ్యాయి.
నిఫ్టీ బ్యాంకు 1.96 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.31 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.29 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.82 శాతం నష్టాల్లో ముగిశాయి.
ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా దెబ్బకొట్టాయి. దీనికి తోడు రిలయన్స్ 0.77 శాతం నష్టపోవడం దెబ్బతీసింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications