ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 14) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 41.48 పాయింట్లు (0.10%) నష్టపోయి 40,584.03 వద్ద, నిఫ్టీ 21.10 పాయింట్లు (0.18%) పాయింట్లు క్షీణించి 11,913.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గం.10.21 సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు నష్టపోయి 40,390 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 9 రోజుల పాటు వరుస లాభాలు చూసిన మార్కెట్లు, పదో రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
429 షేర్లు లాభాల్లో, 477 షేర్లు నష్టాల్లో, 52 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ప్రారంభమైంది. నిన్న విప్రో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల అనంతరం ఈరోజు ఈ స్టాక్ నష్టాల్లోకి వెళ్ళింది. నేడు ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.

మార్కెట్లను కిందకు లాగిన ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్
ఉదయం గం.10 సమయానికి నిఫ్టీ బ్యాంకు 1 శాతానికి పైగా నష్టపోయింది. పీఎన్బీ, కొటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్, బంధన్ బ్యాంకు.. అన్ని స్టాక్స్ కూడా 0.36 శాతం నుండి 1.91 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
నిఫ్టీ బ్యాంకు 1 శాతం, నిఫ్టీ ఆటో 0.39 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ 0.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ ఐటీ 0.99 శాతం, నిఫ్టీ మీడియా 0.63 శాతం, నిఫ్టీ మెటల్ 0.89 శాతం, నిఫ్టీ ఫార్మా 0.80 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకులు 0.81 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.09 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.80 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాల్లో ఉంది.
నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ రంగాలు మార్కెట్లను కిందకు ఎక్కువగా లాగాయి.

పెరిగిన అమ్మకాలు
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, బజాజ్ పైనాన్స్, ఏషియన్ పేయింట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో విప్రో, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
విప్రో ఫలితాల అనంతరం విప్రో, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ అమ్మకాలు పెరిగాయి.
రిలయన్స్ షేర్ధర 0.96 శతం ఎగిసి రూ.2,282.90 వద్ద ట్రేడ్ అయింది. జియో సబ్స్క్రైబర్లు పెరగడంతో పాటు పెట్టుబడులు వస్తుండటంతో ఈ స్టాక్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
డాలర్ మారకంతో రూపాయి 73.39 వద్ద ప్రారంభమైంది.

ఐటీ స్టాక్స్ నేలచూపులు
ఐటీ స్టాక్స్లో టీసీఎస్ షేర్ ధర 0.83 శాతం క్షీణించి రూ.2,802 వద్ద ట్రేడ్ అయింది.
హెచ్సీఎల్ టెక్ షేర్ 1.84 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 1.36 శాతం, టెక్ మహీంద్ర షేర్ 1.58శాతం, విప్రో షేర్ 6.42 శాతం, మైండ్ ట్రీ షేర్ 1.84 శాతం, కోఫోర్జ్ షేర్ 4.84 శాతం మేర క్షీణించింది.
టీసీఎస్ ఫలితాల అనంతరం ఐటీ స్టాక్స్ ఎగిసిపడితే, విప్రో ఫలితాల తర్వాత ఐటీ స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications