ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 21) కుప్పకూలాయి. సెన్సెక్స్ 811.68 పాయింట్లు (2.09 శాతం), నిఫ్టీ 282.75 పాయింట్లు(2.46 శాతం) నష్టపోయి 11,222.20 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ రోజు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటం, మిడ్, స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వంటి వివిధ కారణాలతో మార్కెట్లు నష్టపోయాయి. వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి సవాళ్లు ఎదురు కావడం, చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.

రూ.4.58 లక్షల కోట్ల సంపద ఫట్
మార్కెట్లు కుప్పకూలడంతో ఈరోజు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. రూ.4.58 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.154.42 కోట్లకు క్షీణించింది. మార్కెట్లో భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. మధ్యాహ్నం వరకు మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. చివరికి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

నిలబెట్టుకోలేకపోయిన ఐటీ స్టాక్స్
ఈ నెలలో సెన్సెక్స్ ఒకరోజులో కుప్పకూలడం ఇదే గరిష్టం. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు, కరోనా కేసులు పెరగడం మార్కెట్ పైన ప్రభావం చూపింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈరోజు ఒక్కరోజే రూ.4.5 లక్షల కోట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ 38000 కాస్త పైన ఉండగా, నిఫ్టీ 11,300 దిగువకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్ క్యాప్ 3.6 శాతం, నిఫ్టీ బ్యాంక్ 3 శాతం కోల్పోయింది. 47 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిండాల్కోలు టాప్ లూజర్స్గా నిలిచాయి. నిఫ్టీ బ్యాంకు 646 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 634 పాయింట్లు కోల్పోయింది.
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
ఐటీ స్టాక్స్ ప్రారంభంలో భారీ లాభాల్లో కనిపించినప్పటికీ, చివరకు లాభాలను నిలబెట్టుకోలేదు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 6 శాతం మేర నష్టపోయింది. విప్రో 4 శాతం కోల్పోయింది.

FPI
నగదు విభాగంలో వారంతంలో FPIలు రూ.205 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్(DII) రూ.101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం FPIలు రూ.250 కోట్లు, DIIలు రూ.1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం FPIలు రూ.265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. DIIలు రూ.212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications