స్టాక్ మార్కెట్లు శుక్రవారం(జూన్ 24) భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 52,265 పాయింట్ల వద్ద ముగియగా, నేడు రోజంతా లాభాల్లోనే కదలాడింది. కాస్త పైకి, కిందకు కదిలినప్పటికీ అది కూడా లాభాల్లోనే. ఎప్పుడు కూడా కనీసం దాదాపు 400 పాయింట్ల లాభం కంటే దిగువకు రాలేదు. ఓ సమయంలో సెన్సెక్స్ 53,000 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్ ఉదయం 52,654 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,909 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,447 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 462 పాయింట్లు ఎగిసి 52,727 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 142 పాయింట్లు ఎగిసి 15,699 పాయింట్ల వద్ద ముగిసింది.
ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. కమోడిటీ ధరలు తగ్గడం సూచీలకు కలిసి వచ్చింది. అమెరికాలో బాండ్స్ రాబడులు తగ్గడం, చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుండి దిగి రావడం సూచీల సెంటిమెంటును బలపరిచింది. ఆసియా సూచీలు కూడా నేడు లాభాల్లో ఉన్నాయి. ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడగా, ఐటీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, HUL ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా ఉన్నాయి. ఎల్ఐసీ స్టాక్ నేడు మరింత క్షీణించింది. నేటి సెషన్లో 0.58 శాతం పడిపోయి 3.85 శాతానికి తగ్గింది. ఈ స్టాక్ ప్రస్తుతం రూ.661 స్థాయికి పడిపోయింది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications