ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 7) ఫ్లాటగా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ 13,265 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓఎన్జీసీ స్టాక్స్ 4 శాతం, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ 2 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించాయి. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ తగ్గుతుందనే ఆందోళన నేపథ్యంలో ఈ వారంలో ప్రారంభంలోనే చమురు ధరలు క్షీణించాయి. ఆసియా, అంతర్జాతీయ, భారత మార్కెట్లు కాస్త సానుకూలంగా ఉన్నాయి. ఐఆర్సీటీసీ స్టాక్స్ 8 శాతం లాభపడింది.

సరికొత్త గరిష్టాలకు..
సెన్సెక్స్ గతవారం 45,079.55 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్ప లాభాల్లో ప్రారంభమై, అదే ఒరవడి కొనసాగిస్తోంది. ఉదయం గం.9.51 సమయానికి సెన్సెక్స్ 171 పాయింట్లు లాభపడి 45,250 పాయింట్ల వద్ద ఉంది. తద్వారా సెన్సెక్స్ నేడు మరోసారి జీవనకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 10 పాయింట్లు లేదా 0.08 శాతం లాభపడి 13,269 పాయింట్ల వద్ద ప్రారంభం ్యింది. 1180 షేర్లు లాభాల్లో, 377 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 86 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

రూ.2000కు దిగువనే రిలయన్స్
ఉదయం గం.9.45 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.37 శాతం, ONGC 2.73 శాతం, BPCL 2.56 శాతం, గెయిల్ 2.63 శాతం, యూపీఎల్ 2.06 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 1.21 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.15 శాతం, టైటాన్ కంపెనీ 1.05 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 0.82, హెచ్సీఎల్ టెక్ 0.63 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ స్టాక్ ధర నేడు 0.26 శాతం పెరిగి రూ.1952 వద్ద ట్రేడ్ అయింది. గత కొద్ది సెషన్లుగా రూ.2000కు దిగువనే పలుకుతోంది.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.35 శాతం, మిడ్ క్యాప్ సూచీలు 0.72 శాతం ఎగిశాయి. నిఫ్టీ ఆటో 0.08 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.13 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.80 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 0.09 శాతం, నిఫ్టీ మీడియా 1.41 శాతం, నిఫ్టీ మెటల్ 0.71 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.85 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.29 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫార్మా మాత్రం 0.08 శాతం నష్టపోయింది.
ఐటీలో టీసీఎస్ స్టాక్స్ 0.65 శాతం, హెచ్సీఎల్ టెక్ స్టాక్ 0.49 శాతం నష్టపోయాయి.ఇన్ఫోసిస్ 0.35 శాతం, టెక్ మహీంద్రా స్టాక్ 0.37 శాతం, కోఫోర్జ్ స్టాక్ 0.32 శాతం, మైండ్ ట్రీ స్టాక్ 1.43 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications