ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 1) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కిందకు రాలేదు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్ స్టాక్ జంప్ చేశాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ 3 శాతం మేర లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. బ్యాంక్ నిఫ్టీ 29,817 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 505 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 505.72 పాయింట్లు(1.15%) లాభపడి 44,655.44 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు(1.08%) ఎగిసి 13,109 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1869 షేర్లు లాభాల్లో, 974 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
నిఫ్టీ 50 స్టాక్స్ 1.08 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.59 శాతం లభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.07 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.71 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.38 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 1.87 శాతం, నిఫ్టీ మీడియా 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 1.65 శాతం, నిఫ్టీ ఫార్మా 1.74 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.88 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోయింది.

ఐటీ స్టాక్స్ జంప్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 7.84 శాతం, సన్ ఫార్మా 5.41 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.41 శాతం, ఓఎన్జీసీ 3.89 శాతం, యూపీఎల్ 3.67 శాతం లాభాల్లో ముగిశాయి.నెస్ట్లే 2.63 శాతం, కొటక్ మహీంద్రా 1.64 శాతం, టైటాన్ కంపెనీ 1.48 శాతం, ఎన్టీపీసీ 1.00 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం నష్టాల్లో ముగిశాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్ర, సన్ ఫార్మా ఉన్నాయి.
ఐటీ స్టాక్స్లో టీసీఎస్ 1.84 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.57 శాతం, ఇన్ఫోసిస్ 3.37 శాతం, టెక్ మహీంద్రా 3.79 శాతం, విప్రో 0.91 శాతం, కోఫోర్జ్ 2.11 శాతం లాభపడ్డాయి. మైండ్ ట్రీ స్టాక్ 0.46 శాతం న్టపోయింది.రిలయన్స్ స్టాక్ నేడు 1.26 శాతం లాభపడి రూ.1954 వద్ద క్లోజ్ అయింది.

అందుకే మార్కెట్లు జంప్
ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే దేశీయ మార్కెట్లోకి రికార్డు స్థాయిలో FIIలు తీసుకు రావడంతో మార్కెట్ ర్యాలీ చేసింది. భవిష్యత్తులో పెట్టుబడుల రాక తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నవంబర్ నెలలో రూ,60,300 కోట్ల FIIలు వచ్చాయి. డిసెంబర్లో సెలవుల సీజన్ కావడంతో FII సొమ్ము తగ్గవచ్చు. వ్యాక్సీన్ ఈ నెలలోనే రానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి బ్లూచిప్ స్టాక్స్ ర్యాలీ చేశాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications