ముంబై: సెన్సెక్స్ సంచలనం సృష్టించింది. మార్కెట్ చరిత్రలో మొదటిసారి 50,000 పాయింట్లను క్రాస్ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో గత ఏడాది మార్చి 23న 26వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ గోడకు కొట్టిన బంతిలా పుంజుకుంది. ఏడాది కూడా తిరగకముందే ఏకంగా మరో 24వేలకు పాయింట్లు జత కలిసి 50వేల మార్కును దాటింది.
గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా ఎగిసి 50,098 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 14,736 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి.

గత వారం చివరి సెషన్లో (శుక్రవారం) సెన్సెక్స్ 550 పాయింట్లు, ఈ వారం తొలి సెషన్ (సోమవారం)లో 470 పాయింట్లు కోల్పోయింది. అంటే ఈ రెండు రోజుల్లో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. అనంతరం మంగళవారం సెషన్లో 800 పాయింట్లకు పైగా లాభపడింది. బుధవారం 393 పాయింట్లు ఎగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications