ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (నవంబర్ 11) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా ఎనిమిదో రోజు మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 173.17 పాయింట్లు (0.40%) లాభపడి 43,450.82 వద్ద, నిఫ్టీ 55.30 పాయింట్లు(0.44%) లాభపడి 12,686.40 వద్ద ప్రారంభమైంది.
701 షేర్లు లాభాల్లో, 301 స్టాక్స్ నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలలో ఎలాంటి మార్పులేదు. గత ఎనిమిది సెషన్లుగా లాభాల్లో ఉన్న సెన్సెక్స్, ఈ వారంలో మొదటి రెండు రోజుల్లో 1400 పాయింట్ల మేర లాభపడింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 74.23 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 74.17 వద్ద ముగిసింది.

జీవనకాల గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ
భారత మార్కెట్లు లాభాల్లో ఉండగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 292.06 (0.67%) పాయింట్లు లాభపడి 43,569.71 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభంలో ఓ సమయంలో 43,666 పాయింట్లకు చేరుకుంది. తద్వారా జీవనకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 103.65 (0.82%) పాయింట్లు ఎగిసి 12,734.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 12,762 పాయింట్లను తాకింది.
నిఫ్టీ-50 మార్కెట్ క్యాప్ రూ.100 లక్షల కోట్లను దాటింది.
ఆసియా మార్కెట్ విషయానికి వస్తే నిక్కీ 1.24 శాతం, కోస్పి 0.87 శాతం, సెట్ కాంపోజిట్ 4.31 శాతం, జకర్తా కాంపోజిట్ 1.99 శాతం లాభాల్లో ఉండగా స్ట్రెయిట్ టైమ్స్ 0.79 శాతం, హాంగ్షెంగ్ 0.02 శాతం, షాంఘై కాంపోజిట్ 0.07 శాతం నష్టాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 3.81 శాతం, సిప్లా 3.26 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.27 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.73 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.62 శాతం లాభంతో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.57 శాతం, హెచ్యూఎల్ 1.17 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.08 శాతం, బ్రిటానియా 0.95 శాతం, టైటాన్ కంపెనీ 0.87 శాతం నష్టాల్లో ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, కొటక్ మహీంద్ర బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.61 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.07 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.02 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.36 శాతం, నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.93 శాతం, నిఫ్టీ మెటల్ 1.15 శాతం, నిఫ్టీ ఫార్మా 2.32 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.50 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.21 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.82 శాతం లాభాల్లో ఉన్నాయి. కేవలం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.07 శాతం నష్టాల్లో ఉంది.
నిన్న భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్ నేడు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ 0.77 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.72 శాతం, ఇన్ఫోసిస్ 0.96 శాతం, టెక్ మహీంద్ర 0.91 శాతం, విప్రో 0.70 శాతం, మైండ్ ట్రీ 0.38 శాతం, కోఫోర్జ్ 0.94 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications