ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 13) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభపడిన మార్కెట్లు, నిన్న నష్టాల్లో ముగిశాయి. రెండో రోజు కూడా నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 257.28 పాయింట్లు(0.59%) నష్టపోయి 43,099.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69.40 పాయింట్లు(0.55%) కోల్పోయి 12,621.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
ఓ సమయంలో 200 పాయింట్ల మేర నష్టపోయిన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.10.42 సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభపడింది.
565 షేర్లు లాభాల్లో, 479 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 63 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రిలయన్స్ జంప్, ఐచర్ మోటార్స్ నిరాశపరిచినా స్టాక్ అదుర్స్
ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో... ఐచర్ మోటార్స్ 4.98 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 2.93 శాతం, రిలయన్స్ 2.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.36 శాతం, హీరో మోటో కార్ప్ 1.35 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో... టాటా మోటార్స్ 2.31 శాతం, లార్సన్ 2.20 శాతం, ఐవోసీ 1.41 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.27 శాతం ఉన్నాయ.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు భారీగా లాభపడి రూ.2000 మార్కును దాటింది. రిలయన్స్ టాప్ గెయినర్గా ఉంది. రిలయన్స్ స్టాక్ ధర 2.50 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ, రూ.2000కు పైనే ఉంది.
ఐచర్ మోటార్స్ టార్గెట్ ధరను రూ.3025గా ఎంకే గ్లోబల్ పేర్కొంది. త్రైమాసిక ఫలితాల ప్రకారం లాభాలు 40 శాతం క్షీణించాయి. అయినప్పటికీ స్టాక్ నేడు 52 వారాల గరిష్టాన్ని తాకింది. దాదాపు 5 శాతం మేర లాభపడి రూ.2,464 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ స్టాక్స్ డౌన్
రంగాలవారీగా చూస్తే నిఫ్టీఆటో 0.32 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.91శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 0.84 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.90 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.38 శాతం, నిఫ్టీ ఐటీ 0.38 శాతం, నిఫ్టీ మీడియా 1.51 శాతం, నిఫ్టీ మెటల్ 0.30 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.71 శాతం నష్టపోయాయి.
ఐటీ స్టాక్స్లో టీసీఎస్ 1 శాతం,టెక్ మహీంద్ర 0.91 శాతం, విప్రో 0.59 శాతం, మైండ్ ట్రీ 0.78 శాతం, కోఫోర్జ్ 1.04 శాతం నష్టపోయాయి. హెచ్సీఎల్ టెక్ 0.19 శాతం, ఇన్ఫోసిస్ 0.38 శాతం శాతం లాభపడ్డాయి.

పడిలేచిన మార్కెట్లు
అమెరికా సహా ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు లాక్ డౌన్ ఆంక్షలు పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ, అమెరికా మార్కెట్లు పడిపోయాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. వీటికి బ్యాంకింగ్, మెటల్ రంగాల భారీ నష్టాలు తోడవడంతో కుప్పకూలాయి. అయితే ఆ తర్వాత కోలుకున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications