దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అలాగే మార్కెట్ ఇటీవలి గరిష్టస్థాయికి చేరుకోవడంతో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. మొన్న 554 పాయింట్లు నష్టపోగా, నిన్న 656 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ నేడు మరోసారి 634 పాయింట్లు పతనమైంది. ఈ మూడు రోజుల్లోనే 1800 పాయింట్లకు పైగా క్షీణించింది. దీంతో 60,000 పాయింట్ల దిగువకే కాదు, 59,500 పాయింట్ల కిందకు పడిపోయింది. నేడు ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 60,045.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,045.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,068.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,921.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,943.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,648.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 634.20 (1.06%) పాయింట్లు నష్టపోయి 59,464.62 పాయింట్ల వద్ద, నిఫ్టీ 181.40 (1.01%) పాయింట్లు నష్టపోయి 17,757.00 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో గత మూడు రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడు సెషన్లలో సెన్సెక్స్ 1800 పాయింట్లు కోల్పోవడంతో రూ.6.56 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. సోమవారం నాటికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ వ్యాల్యూ రూ.2.80 లక్షల కోట్లు కాగా, గురువారం నాటికి ఇది రూ.273 లక్షల కోట్లకు పడిపోయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications