ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్, 10) లాభాల్లో ముగిశాయి. పార్మా షేర్లు ఏకంగా 5 శాతం లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 141 పాయింట్లు(0.37 శాతం) లాభపడి 38,182 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 11,270 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమై, చివరకు అదే దూకుడులో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.

స్వల్పంగా పుంజుకున్న రూపాయి
సిప్లా, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. పార్మా రంగం భారీ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 74.90 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం 74.93 వద్ద క్లోజ్ అయిన రూపాయి ఈ రోజు ఉదయం 74.95 వద్ద ప్రారంభమైంది. 75.85 నుండి 74.96 మధ్య ట్రేడ్ అయింది.

సిప్లా హవా.. ఎల్ అండ్ టీకీ రక్షణశాఖ నిర్ణయం ఊతం
నిఫ్టీ బ్యాంక్ వరుసగా ఆరో సెషన్లో లాభపడింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఐదు నెలల గరిష్టం 16,362కు చేరుకుంది. ఈ రోజు మార్కెట్లో రోజంతా సిప్లా హవా నడిచింది. సిప్లా ఏకంగా 9.48 శాతం ఎగిసి రూ.797.70కి చేరుకుంది. రక్షణ శాఖ 101 దిగుమతులను క్రమంగా నిషేధిస్తామని వెల్లడించింది. దీంతో ఎల్ అండ్ టీ రెండు షేర్ రెండు నెలల గరిష్టానికి (దాదాపు 5 శాతం ఎగిసింది) చేరుకుంది. వాల్ చంద్ నగర్ కూడా దాదాపు 5 శాతం ఎగిసింది. హిందూస్తాన్ ఏరో నాటిక్స్ షేర్లు అయితే ఏకంగా 8 శాతానికి పైగా ఎగిశాయి. డిఫెన్స్ షేర్లు అన్ని లాభపడ్డాయి.

గరిష్టం నుండి కిందకు లాగిన రిలయన్స్
ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, సిప్లా నిఫ్టీని లాభాల్లోకి తీసుకు వస్తే, రిలయన్స్ నష్టపోయి గరిష్ట స్థాయి నుండి కిందకు లాగింది. రిలయన్స్ 1.16 శాతం నష్టపోయింది. మొదటి త్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేయడంతో Ipca ల్యాబ్స్ భారీగా లాభపడింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications