ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(జూలై 6) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 313.48 పాయింట్లు లేదా 0.87% ఎగిసి 36,334.90 వద్ద, నిఫ్టీ 109.40 పాయింట్లు లేదా 1.03% లాభపడి 10,716.80 వద్ద ప్రారంభమైంది. 883 షేర్లు లాభాల్లో, 302 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 71 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ దాదాపు 460 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది.
రూపాయి ఈరోజు మరింత బలపడింది. డాలర్ మారకంతో 14పైసలు బలపడి 74.50 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఆ తర్వాత 74.62 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 74.64 వద్ద క్లోజ్ అయింది.

మధ్యాహ్నం గం.12.00 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, హెచ్యూఎల్ ఉన్నాయి. బ్యాంకు, మెటల్, ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. ఫార్మా రంగం మాత్రం నష్టాలు చవి చూస్తోంది. ఎన్ఎస్ఈలో పలు స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండగా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 15 శాతం పెరిగి బ్యారెల్ ధర 42.95 డాలర్లకు చేరుకుంది.
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications