ఇరాన్-అమెరికా టెన్షన్స్: డాలర్తో భారీగా నష్టపోయిన రూపాయి
ముంబై: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బంగారం, క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. దీంతో భారతీయ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చమురు ధరలు అంతకంతకు పెరగుతుండటంతో డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం 31 పైసలు తగ్గి 72.11 వద్ద ట్రేడ్ అయింది.
అమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఫారెక్స్ ట్రేడర్స్ అంటున్నారు. సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారన్ ఎక్స్చేంజ్లో డాలర్తో రూపాయి 72.03 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 72.11కి పడిపోయింది. గత క్లోజింగ్ కంటే 31 పైసలు నష్టపోయింది. శుక్రవారం రూపాయి 71.81వద్ద క్లోజయింది. కాగా, అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 70.59 (2.90 శాతం) పెరిగింది.