రిలయన్స్ ఉద్యోగులకు కరోనా వ్యాక్సీన్ ఉచితం!

ముంబై: తమ కంపెనీ ఉద్యోగులకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రయివేటు ఆసుపత్రుల్లోను టీకా ధరను నిర్ణయించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు వ్యాక్సీన్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు నీతా అంబానీ. ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ ఉచితం. పిల్లలు, తల్లిదండ్రులకు ఉంటుంది.

ఉద్యోగులు, వారి కుటుంబ సబ్యులకు కరోనా వ్యాక్సీన్‌ను ఉచితంగా అందజేస్తామని నీతా అంబానీ తెలిపారు. ఇందుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపించారు.ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకు ముఖ్యమన్నారు. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలన్నారు.

Reliance to bear full costs of employees, family members vaccination: Nita Ambani

గత సంవత్సరం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ప్రకటించారు. ఆ మేరకు అధికారికంగా నీతా అంబానీ ఇప్పుడు ఉద్యోగులకు మెయిల్ సందేశం పంపించారు. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+