కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తమ ఉద్యోగులకు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రూ.15 లక్షల కంటే తక్కువ వేతనం ఉన్న వారికి కోత లేదని భారీ ఊరట ప్రకటన చేసింది. రూ.15 లక్షలకు పైన ఉంటే 10 శాతం నుండి 50 శాతం వేతన కోత విధిస్తోంది. ముఖేష్ అంబానీ ఏడాది పాటు వేతనం తీసుకోవద్దని నిర్ణయించారు.

ఏడాదికి రూ.600 కోట్ల ఆదా
ఉద్యోగులందరికీ వేతన కోత లేదు. కేవలం రూ.15 లక్షలకు పైన ఉన్న వారికే కోత ఉంటుంది కాబట్టి మిగతా వారందరికీ అతి పెద్ద ఊరటే అని చెప్పవచ్చు. అయితే ఈ వేతన కోత వల్ల కంపెనీకి మిగిలే మొత్తం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే అతి తక్కువ. వేతనాల కోత వల్ల ఏడాదికి రూ.600 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఎవరి వేతనంలో ఎంత కోత?
ముఖేష్ అంబానీ తన వార్షిక వేతనం రూ.15 కోట్లను వదులుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వేతనం తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ బోర్డ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ల పారితోషికంలో 30 శాతం నుండి 50 శాతం కోత పడుతుంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి 10 శాతం కోత విధిస్తున్నారు.

నెలకు రూ.50 కోట్లు...
2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఖర్చుల కోసం రిలయన్స్ రూ.6,067 కోట్లు (రిఫైనింగ్, పెట్రో కెమికల్స్) ఖర్చు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.1,506 కోట్లు ఖర్చు చేసింది. పది శాతం కోత, తక్కువ మంది ఉద్యోగులకు వేతన కోత ద్వారా రిలయన్స్ ఏడాదిలో చేసే పొదుపు తక్కువే అంటున్నారు నిపుణులు. నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.600 కోట్ల వరకు మాత్రమే ఆదా అవుతాయని చెబుతున్నారు.

జియో, రిటైల్ సహా వీరి వేతనం
గురువారం (ఏప్రిల్ 31) నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.3 లక్షల కోట్లు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సహా ఉద్యోగులు సహా ఏకీకృత స్థాయిలో రిలయన్స్ ఉద్యోగుల వేతనం 2019-20లో రూ.14,075 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది రూ.12,488 కోట్లు. అంటే వేతన కోత వల్ల రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థకు ఆదాయ అయ్యే సొమ్ము రూ.600 కోట్లు అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications