రైతులకు మోడీ కొత్త సంవత్సర కానుక, జనవరి 2న అకౌంట్లలో డబ్బులు
6 కోట్ల మంది రైతులకు గుడ్న్యూస్! పీఎం కిసాన్ స్కీం కింద ఏడాదికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దీనిని మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2,000 అందిస్తోంది. ప్రధాని మోడీ రైతులకు ఈ పెట్టుబడి కానుకను నూతన సంవత్సర సందర్భంగా జనవరి 2, 2020న అందించనున్నారు.
SBI కస్టమర్లకు హెచ్చరిక! కార్డు మార్చుకునేందుకు రేపే ఆఖరు తేదీ
రూ.12,000 కోట్లు రైతుల అకౌంట్లలోకి..
జనవరి 2 దేశవ్యాప్తంగా 6వేల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ కానున్నాయి. అంటే వీరి అకౌంట్లలో రూ.12,000 కోట్లు జమ అవుతున్నాయి. కొత్త ఏడాది కానుకగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.
పాన్-బ్యాంకు అకౌంట్ లింక్ తప్పనిసరి..
డిసెంబర్ 1వ తేదీ నుంచి తదుపరి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రైతులకు క్రెడిట్ కాలేదు. 2019 చివరి విడత రూ.2,000 రైతులకు అందించనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు అకౌంట్ లింక్ చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు వస్తాయి. ఆరున్నర కోట్ల మంది రైతులు ఆధార్ - బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకున్నారు. వీరికి ప్రయోజనం చేకూరనుంది.
14 కోట్ల మందికి ప్రయోజనం కానీ...
మొత్తంగా 14 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందే అర్హత కలిగినవారు ఉన్నారని అంచనా. డిసెంబర్ 29 నాటికి కేంద్రానికి 9.2 కోట్ల మంది రైతుల డేటా అందింది. పశ్చిమ బెంగాల్లో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీంకు నో చెబుతోంది. ఉత్తర ప్రదేశ్ నుంచి 2.4 కోట్ల రైతులకు గాను 2 కోట్ల మంది రైతుల డేటా అందింది.
రూ.75వేల కోట్లలో 40 శాతం మిగులు!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.75,000 కోట్లు కేటాయించింది. వివిధ కారణాల వల్ల ఇందులో రూ.45,000 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుండగా, దాదాపు 40 శాతం బడ్జెట్ నిధులు మిగలనున్నాయి. నవంబర్ 30 వరకు కేంద్రం రూ.35,955.66 కోట్లు రైతుల అకౌంట్లలోకి ట్రాన్సుఫర్ చేసింది. ఇప్పుడు మరో రూ.12 కోట్లకు పైగా ట్రాన్సుఫర్ చేయనుంది.