టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కింద 61 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో గిన్నీ పిలమెంట్స్, కింబర్లే క్లార్క్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, అరవింద్ లిమిటెడ్ తదితర 61 సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ పీఎల్ఐ పథకానికి మొత్తం 67 సంస్థల నుండి ప్రతిపాదనలు వచ్చాయి. ఆమోదించిన 61 దరఖాస్తుల ద్వారా రూ.19,077 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తున్నాయి. దీంతో రూ.1,84,917 కోట్ల టర్నోవర్ ఉంటుందని, 2.40 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎగుమతుల పెంపు లక్ష్యం
దాదాపు రూ.15 వేల కోట్ల మేర జరుగుతున్న జౌళీ ఎగుమతులకు రూ.60,000 కోట్ల నుండి రూ.75,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం 67 దరఖాస్తుల్లో మొదటి విభాగం కింద 15, రెండో విభాగం కింద 52 వచ్చాయి. మొదటి విభాగంలో కనీస పెట్టుబడి రూ.300 కోట్లు, ప్రోత్సాహకాలు పొందేందుకు టర్నోవర్ రూ.600 కోట్లు. రెండో విభాగం కింద కనీస పెట్టుబడి రూ.100 కోట్లు కాగా, ప్రోత్సాహకాలు పొందడానికి కనీస టర్నోవర్ రూ.200 కోట్లుగా నిర్ణయించారు.

దరఖాస్తులు
ఆవ్గోల్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, గోవా గ్లాస్ ఫైబర్ లిమిటెడ్, హెచ్పీ కాటన్ టెక్స్టైల్స్ మిల్క్, కింబర్లే క్లార్క్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, మధుర ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్, ఎంసీపీఐ ప్రయివేట్ లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్పోర్ట్స్, ట్రైడెంట్ లిమిటెడ్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ వంటి సంస్థల దరఖాస్తులకు ఆమోదం లభించింది.

రాష్ట్రాలకు ప్రత్యేక విధానం
మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం కింద 13 రాష్ట్రాల నుండి 17 ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో మధ్యప్రదేశ్ నుండి నాలుగు, కర్నాటక నుండి రెండు వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపించారు. ఈ పథకం కింద ఏడు పార్స్ను ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications