న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగా వాటి రేట్లను పెంచేశాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఇది 14వ సారి. అంటే నెలలో ఇప్పటికే సగం రోజులకు పైగా వాటి రేట్లను పెంచినట్టయింది. ధరలలను పెంచడంలో ఏ మాత్రం రాజీ ధోరణిని ప్రదర్శించట్లేదా ఆయిల్ కంపెనీలు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. పలు చోట్ల డీజిల్ కూడా 100 రూపాయల మార్క్ను దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపు కాదు.

పెట్రోల్, డీజిల్పై ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్పై జాయింట్గా 35 పైసల మేర పెరిగింది. ఇదివరకెప్పుడూ 35 పైసల మేర పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.98.11, డీజిల్ 88.65 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 104 మార్క్ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.104.22 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 96.16కు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 98.19, డీజిల్ ధర రూ.93.23, కోల్కతలో పెట్రోల్ రూ.97.97 పైసలు, డీజిల్ ధర రూ.91.50 పైసలకు చేరింది.

హైదరాబాద్లో 102కు టచ్
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయలకు టచ్ అవుతోంది. తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి హైదరాబాద్లో రూ.101.96 పైసలుగా నమోదైంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.96.63 పైసలు. ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసింది. భోపాల్లో పెట్రోల్-106.35, డీజిల్-97.37 రూపాయలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.39, డీజిల్ 93.99, లక్నోలో పెట్రోల్ రూ.95.29, డీజిల్ రూ.89.06 పైసలు పలుకుతోంది. తాజాగా బిహార్, కేరళలు వంద రూపాయల లిస్ట్లోకి చేరాయి. ఈ రెండు రాష్ట్రాల రాజధానులు పాట్నా, తిరువనంతపురంలల్లో పెట్రోల్ రేటు వంద దాటింది. పాట్నాలో పెట్రోల్ రూ.100.14 పైసలు, డీజిల్ రూ.93.99 పైసలు ఉండగా.. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.100.09, డీజిల్ 95.19 పైసలకు చేరింది.

డీజిల్ రేటు దిమ్మ తిరిగేలా..
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో డీజిల్ రేటు 101 రూపాయలను దాటేసింది. అక్కడ డీజిల్ లీటర్ ఒక్కింటికి 101.85 పైసలకు చేరింది. పెట్రోల్ కొత్త రికార్డు నెలకొల్పింది. రూ.110 రూపాయలకు చేరువైంది. పెట్రోల్ లీటర్ 109.30 పైసలుగా నమోదైంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లఢక్, బిహార్, కేరళల్లో వంద రూపాయలను దాటేశాయి. ఇప్పుడున్న ఇదే దూకుడు కొనసాగితే- పెట్రో రేట్లు 100 రూపాయల ల్యాండ్మార్క్ను దాటినట్టవుతుంది.
More From GoodReturns

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications