Post Office Scheme: రోజుకు రూ.50 చెల్లిస్తే చాలు.. రూ.35 లక్షలు మీ సొంతం..
దేశంలో మధ్య తరగతి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారు చాలా మంది చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తారు. అయితే వీరు నమ్మకమైన పథకాల్లో పెట్టుబడి పెడతారు. అలాంటి పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ప్రచుర్యం పొందాయి. తపాలా శాఖ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్ కింద అనేక ప్లాన్లను ప్రారంభించింది. వాటిలో గ్రామ సురక్ష యోజన అత్యంత ప్రజాదరణ పొందింది.
పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన అనేది పూర్తి జీవిత బీమా
పాలసీ. ఇది ఐదు సంవత్సరాల కవరేజీ తర్వాత ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీకి మార్చుకునే అవకాశం ఉంది. ఇది 55, 58, లేదా 60 సంవత్సరాల వయస్సు వరకు తగ్గిన ప్రీమియంలను చెల్లించడం ద్వారా పాలసీదారుని గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
గ్రామ సురక్ష యోజన
గ్రామ సురక్ష యోజన కింద ప్రతి నెలా కేవలం రూ. 50 చెల్లించడం ద్వారా పాలసీదారుడు రూ. 35 లక్షల వరకు రిటర్న్స్లో రాబడి పొందవచ్చు. వ్యక్తి ప్రతి నెలా పాలసీలో రూ.1,515 పెట్టుబడి పెడితే, అంటే రోజుకు దాదాపు రూ.50, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత ఆ వ్యక్తి రూ.34.60 లక్షల రాబడిని అందుకుంటాడు. పెట్టుబడిదారుడు 55 సంవత్సరాల కాలానికి రూ. 31,60,000, 58 సంవత్సరాల కాలానికి రూ. 33 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందుకుంటారు.
గ్రామీణ భారతీయుల కోసం
రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) 1995లో ప్రవేశ పెట్టారు. ఇండియా పోస్ట్ వెబ్సైట్ ప్రకారం, "ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం సాధారణంగా గ్రామీణ ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలు, మహిళా కార్మికులకు సహాయం చేయడం ముఖ్య ఉద్దేశం.