పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ కూతురు లైలా రుస్తుం(62)కు చెందిన బ్యాంకు ఖాతా నుండి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా రూ.90వేలు ఉపసంహరించారు. జూలై నెలలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి దక్షిణ ముంబైలోని కొలబా పోలీస్ స్టేషన్లో సైబర్ నేరం కేసు నమోదయింది. జూలై నెలలో మిస్త్రీ నేతృత్వంలోని కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్(అకౌంట్స్) జయేష్ మర్చంట్కు బ్యాంకు ఖాతా నుండి నగదు ఉపసంహరించినట్లు మొబైల్ సందేశం వచ్చింది. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది మిస్త్రీ ఇద్దరు కూతుళ్లలో ఒకరైన లైలా రుస్తుంకు చెందిన బ్యాంకు ఖాతా. లైలా దుబాయ్లో ఉంటున్నారు.

ట్రాన్సాక్షన్ కోసం ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు
లైలా రుస్తుం తరఫున తండ్రికి బ్యాంకు ఖాతాను నిర్వహించే అధికారం ఉంది. 2018లో కంపెనీ డైరెక్టర్ ఫిరోజ్ భటెనాకు ఖాతా నిర్వహణ అధికారాన్ని మిస్త్రీ ఇచ్చారు. భటేనా ఈ బాధ్యతలను జయేష్ మర్చంట్కు అప్పగించారు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ నిర్వహణ కోసం కంపెనీ అధికారులు జయేష్ మొబైల్ నెంబర్ను బ్యాంకుకు అందించారు. ఈ సైబర్ మోసపూరిత ట్రాన్సాక్షన్ సందేశం మొబైల్ ఫోన్కు రావడంతో ఘటన వెలుగు చూసింది. కేసు నమోదయినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతా చాలా కాలం నుండి కొనసాగుతోంది. చెక్ రూపంలో ఎక్కువగా ఉపసంహరణలు జరిగాయి.

నగదు ఉపసంహరణ...
నగదు ఉపసంహరణకు సంబంధించి సందేశం వచ్చిన అనంతరం జయేష్ మర్చంట్ బ్యాంకుకు ఫోన్ చేసి అడిగారు. డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయో చెప్పాలని అడిగారు. డెబిట్ కార్డును ఉపయోగించి పలు ట్రాన్సాక్షన్స్లో రూ.90వేలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జయేష్ మర్చంట్ కొలాబా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 420(చీటింగ్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66సీ, 66డీ కింద కేసు నమోదు చేశారు.

అసలు డెబిట్ కార్డు జారీ చేయలేదు
డెబిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు తేలినప్పటికీ, అసలు ఈ అకౌంట్కు డెబిట్ కార్డును జారీ చేయలేదని జయేష్ మర్చంట్ బ్యాంకు మేనేజర్కు తెలిపారు. అయితే భటేనా పేరు మీద 2018లో క్రెడిట్ కార్డు జారీ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేయడంతో జయేష్ మర్చంట్ ఆశ్చర్యపోయారు. ఈ కార్డును కొలబాలోని కార్యాలయానికి కొరియర్ చేసినట్లు రికార్డులో ఉంది. డబ్బును ఉపసంహరించుకోవడానికి అదే డెబిట్ కార్డు ఉపయోగించినట్లు తేలింది. ఆఫీస్కు చెందిన వారు ఎవరు కూడా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications