పెన్షన్దారులకు శుభవార్త, జనవరి 1 నుంచి అందుబాటులోకి అడ్వాన్స్ విధానం
న్యూఢిల్లీ: పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. చాలాకాలంగా ఉన్న వారి కోరిక నెరవేరుతోంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకునే వెసులుబాటు కలగనుంది. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తోంది. 2009లో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని EPFO నిర్ణయించింది.
బిజినెస్మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..
ఈ నిర్ణయంతో పెన్షన్ అడ్వాన్స్ తీసుకోవాలని కోరుకున్న 6,30,000 మంది లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం పదిహేనేళ్ల వరకు నెలవారీ పెన్షన్ మూడో వంతు కోత ద్వారా ఆ మొత్తాన్ని పెన్షన్దారులకు చెల్లిస్తారు. పదిహేనేళ్ల తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న ఈ విధానం ప్రయివేటు ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ జనవరి 1, 2020న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్ణయం అమలుపై నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెబుతున్నారు.