ఎగవేతదారుగా అనుగ్రాహ్ స్టాక్ బ్రోకింగ్, ప్రకటించిన ఎన్ఎస్ఈ
ముంబై: అనుగ్రాహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) ఎగవేతదారుగా ప్రకటించింది. ఆ సంస్థకు ట్రేడింగ్ హక్కులను కూడా రద్దు చేసింది. దీంతో పాటు బ్రోకరేజీ హౌస్ మెంబర్షిప్ను కూడా తొలగించింది. ఎన్ఎస్ఈ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మెంబర్షిప్ను తొలగించిన కొద్ది రోజుల్లోనే మరో బ్రోకింగ్ సంస్థ పైన అలాంటి చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఈ మేరకు ఎన్ఎస్ఈ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు ఎక్స్చేంజీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఎన్ఎస్ఈఐఎల్ నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్ 26వ తేదీన మార్కెట్ ముగిసిన తర్వాత నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇటీవల కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సభ్యత్వాన్ని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తొలగించాయి.
పన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్కు రూ.75,000 కోట్ల నష్టం
అనుగ్రాహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ కార్యకలాపాలపై నవంబర్ 13వ తేదీన సెబి సస్బెన్షన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత విచారణలో అవకతవకలు కనిపించడంతో చర్యలు తీసుకుంది.