For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EMI moratorium ఆప్షన్ ఎంతమంది ఉపయోగించుకున్నారంటే? వారు కూడా అందుకే..

|

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలకు మారటోరియం విధించిన ఆర్బీఐ... ఆగస్ట్ వరకు పొడిగించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారటోరియం మొదటి మూడు నెలలు ఎక్కువ మంది ఉపయోగించుకున్నారా, లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో మరెంతమంది ఉపయోగించుకుంటారు అనేది చూడాలి.

H1B వీసాదారులకు దిగ్గజ కంపెనీలు ఇచ్చే వేతనం తక్కువే! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా కంపెనీల్లో ఇలా..H1B వీసాదారులకు దిగ్గజ కంపెనీలు ఇచ్చే వేతనం తక్కువే! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా కంపెనీల్లో ఇలా..

మారటోరియం ఉపయోగించుకుంది 10 శాతమే

మారటోరియం ఉపయోగించుకుంది 10 శాతమే

ప్రభుత్వరంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు చెందిన కస్టమర్లు కేవలం 10% మాత్రమే ఈ మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ప్రయివేటు రంగ దిగ్గజం HDFC కస్టమర్లు ఈ వెసులుబాటు ఉపయోగించుకున్నది కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఎల్ఐసీ హౌసింగ్ లోన్ నుండి రుణం తీసుకున్న వారు 15 శాతం వరకే మారటోరియం ఉపయోగించుకున్నారు. యాక్సిస్ బ్యాంకుకు చెందిన కస్టమర్లు 10 శాతం నుండి 12 శాతం ఉపయోగించుకున్నారు. లోన్ వ్యాల్యూలో ఇది 25 శాతం నుండి 28 శాతం మధ్య ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంకు అయితే కేవలం 5 శాతం మంది మాత్రమే ఉపయోగించుకున్నారు.

ఈ రంగాల నుండి ఎక్కువ.. దరఖాస్తులు మరిన్ని రావొచ్చు

ఈ రంగాల నుండి ఎక్కువ.. దరఖాస్తులు మరిన్ని రావొచ్చు

కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రాన్సుపోర్ట్ రంగాలు దీనిని ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. ఈ డేటా మొదటి రెండు నెలలకు సంబంధించినది. రుణగ్రహీతలు మారటోరియం ఆప్షన్ ఎంచుకోవడానికి ఈ తేదీలోపు అనే గడువు లేదు. కాబట్టి బ్యాంకులకు వరుసగా దరఖాస్తులు వస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పూర్తిగా లాక్ డౌన్ నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే వచ్చే నెల నుండి ఆర్బీఐ మారటోరియం మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఇవ్వాలి.

నగదు ఉన్నా..

నగదు ఉన్నా..

కొంతమంది లేదా కొన్ని సంస్థల వద్ద నగదు ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మారటోరియం ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. చేతిలో లిక్విడిటీ పెట్టుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి సంస్థలు. అలాగే ఉద్యోగాల కోత, శాలరీ కోత భయంతో ఉద్యోగులు దీనిని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల ఎంఎస్ఎంఈ రుణ పుస్తకం వ్యాల్యూ రూ.90 లక్షల కోట్లుగా ఉంది. రుణాల్లో ఈ వాటా 20 శాతం.

English summary

EMI moratorium ఆప్షన్ ఎంతమంది ఉపయోగించుకున్నారంటే? వారు కూడా అందుకే.. | No, Thank You: Less than 10 percent bank borrowers avail 3 month EMI moratorium

Most of the banks' borrowers of retail and corporate loans seem to be staying away from availing the three-month EMI (Equated Monthly Instalments) moratorium under the Reserve Bank of India's (RBI) Covid Relief Package.
Story first published: Thursday, May 7, 2020, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X