ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(ఆగస్ట్ 24) లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 364.36 పాయింట్లు లేదా 0.95% ఎగిసి 38,799.08 వద్ద, నిఫ్టీ 94.90 పాయింట్లు 0.83% లాభపడి 11,466.50 వద్ద ముగిసింది. 1500 షేర్లు లాభాల్లో, 1109 షేర్లు నష్టాల్లో ముగియగా, 136 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత అంతకుమించి లాభాలతో ముగిశాయి. ఈ రోజు పదుల సంఖ్యలో కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటిస్తున్నాయి. అదానీ గ్రూప్ ముంబై విమానాశ్రయంలో 74% వాటాను సొంతం చేసుకుంటుందని వార్తలు రావడంతో ఉదయం ఈ కంపెనీ షేర్లు ఎగిసిపడ్డాయి.

అదానీ పోర్ట్స్ నష్టాల్లో..
టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, అదానీ పోర్ట్స్, హిండాల్కో, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. ముంబై విమానాశ్రయంలో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంటుందని ఉదయం వార్తలు వచ్చాయి. దీంతో అదానీ పోర్ట్స్ షేర్లు ప్రారంభంలో భారీ లాభాల్లోకి వచ్చాయి. కానీ ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లుగా తెలియడంతో దాదాపు 1 శాతం నష్టాల్లో ముగిసింది.

అందుకే లాభాల్లో మార్కెట్లు
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం భారీ లాభాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 364 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండతో మార్కెట్లు దూసుకెళ్లాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. వినోద రంగానికి సంబంధించి భారీ ఊరట కలిగింది. షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చునని కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.

పెట్టుబడులు
నగదు విభాగంలో క్రితం వారం చివరి సెషన్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) దాదాపు రూ.251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం FPIలు రూ.268 కోట్లు, DIIలు రూ.672 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications