కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాటు వేసింది. ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది మృతి చెందారు. కోట్లాది మంది వేతనాల కోత లేదా ఉద్యోగాల కోత ఎదుర్కొని, ఆర్థికంగా చితికి పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ చాలామంది కుబేరుల ఆస్తులు పెరిగాయి. ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీయే కాదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏకంగా ప్రపంచ నెంబర్ వన్గా ఎదిగారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద కూడా కనీవినీ ఎరుగని విధంగా పెరిగింది. ఇలా చాలామంది వరుసలో ఉన్నారు.

సాధారణ వ్యక్తికి 10,000 సంవత్సరాలు
కరోనా సమయంలో భారీగా సంపాదించిన వారిలో మన దేశంలో ముఖేష్ అంబానీ ముందున్నారు. ఈ కాలంలో ప్రతి గంటలో ముఖేష్కు వచ్చిన ఆదాయం ఓ సాధారణ వ్యక్తి సంపాదించాలంటే కనీసం 10,000 సంవత్సరాల వరకు పడుతుందని అంచనా. అలాగే, ఒక సెకనుకు ముఖేష్ సంపాదన సాధారణ వ్యక్తికి మూడేళ్ల వరకు పడుతుంది.
ఆక్స్ఫామ్ ఇన్-ఈక్వాలిటీ నివేదిక ప్రకారం కరోనా సమయంలో ముఖేష్ సంపాదన భారీగా ఎగిసింది. ఈ మేరకు ఆక్స్ఫామ్ ఇన్-ఈక్వాలిటీ 'ది ఇన్-ఈక్వాలిటీ వైరస్ రిపోర్ట్'లో తెలిపింది. కరోనా సమయంలో సామాజిక, ఆర్థిక, జెండర్ ఇన్-ఈక్వాలిటీ కూడా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ముఖేష్ ఆదాయం గంటకు రూ.90 కోట్లు
కరోనా సమయంలో ముఖేష్ అంబానీ గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు. ముఖేష్ అంబానీదే కాదు, ప్రపంచ, భారత కుబేరుల సంపద ఈ కాలంలో ఎగిసిపడింది. భారత కుబేరుల ఆదాయం ఈ కాలంలో 35 శాతం పెరిగింది. 2009 నుండి తీసుకుంటే 90 శాతం పెరిగి 422.9 బిలియన్ డాలర్లుగా ఉంది. బిలియనీర్స్ ర్యాంకింగ్లో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ఆరో స్థానంలో ఉంది. కరోనా సమయంలో భారత టాప్ 11 మంది కుబేరుల వద్ద పెరిగిన సంపదతో MGNREGS స్కీంను సులభంగా నిర్వహించవచ్చు. హెల్త్ మినిస్ట్రీకి 10 ఏళ్ల పాటు ఇవ్వవచ్చు.

24 శాతం మంది ఆదాయం రూ.3వేల కంటే తక్కువ
ముఖేష్ అంబానీ సంపద కరోనా కాలంలో 72 శాతం పెరిగింది. గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు. అదే సమయంలో దేశంలో 24 శాతం మంది రూ.3000 కంటే తక్కువ ఆర్జించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం 90 శాతం మంది అసంఘటిత ఎకానమీలో ఉన్నారు. 40 కోట్ల మంది వరకు ఉంటారు. కరోనా సమయంలో నెలకు రూ.20వేలు సంపాదించే వారి ఆదాయం 37 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications