ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక! కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (PF) వడ్డీకి సంబంధించి శుభవార్తను చెప్పింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాపై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ అంగీకరించిందని సీనియర్ అధికారులు తెలిపారు. 'ఆరు కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ చొప్పున జమ చేసేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది' అని తెలిపారు.

గెజిట్ తర్వాత..
ఆర్థికమంత్రిత్వ శాఖ అంగీకారం పొందిన అనంతరం ఈపీఎప్ పైన వడ్డీ రేటును కార్మిక మంత్రిత్వ శాఖ సంతోష్ గాంగ్వార్ గురువారం నోటిఫికేషన్ అధికారికంగా ఆమోదించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం గెజిట్లో వడ్డీ రేటును అధికారికంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం ఈపీఎఫ్ పైన రాబడి రేటును చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తుంది.

రెండు విడతలుగా..
ఈ ఏడాది మార్చి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అఫెక్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీరేటు ఇవ్వడానికి ఆమోదించింది. సెప్టెంబర్ నెలలో 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతంగా విభజించాలని నిర్ణయించింది. అయితే 8.5 శాతం మొత్తాన్ని ఒకేసారి జమ చేయాలని ఆ తర్వాత నిర్ణయించింది.

త్వరలో వడ్డీ రాబడి
రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ రేటును డిసెంబర్ చివరి నాటికి ఒకేసారి 6 కోట్ల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో జమ చేసే అవకాశముందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఈ రోజు లేదా త్వరలో విడుదల చేసే అవకాశముంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications