అంతర్జాతీయ నిధుల లభ్యతకు తోడు, డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు IPOల ద్వారా రూ.31 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. సెకండరీ మార్కెట్లో సెంటిమెంట్ బాగుండటం, ప్రైమరీ మార్కెట్కు మద్దతుగా నిలిచింది. 2021-22లోను పబ్లిక్ ఇష్యూలు వరుస పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెబి వద్ద ఐపీవో అనుమతుల కోసం 28 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.28,710 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉన్నాయని చెబుతున్నారు.

ఐపీవో ద్వారా సమీకరణ
FY22లో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC), హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్డీఈఎక్స్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ పైనాన్స్ బ్యాంకుల ఐపీవోలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. 2020-21లో ఐపీవోలే కాకుండా యస్ బ్యాంకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.15వేల కోట్లు సమీకరించింది.
2017-18లో రూ.82,109 కోట్లు, 2018-19లో రూ.14,719 కోట్లు, 2019-20లో రూ.20,352 కోట్లు, 2020-21లో రూ.31,277 కోట్లు సమీకరించాయి. FY18లో 45 కంపెనీలు, FY19లో 14 కంపెనీలు, FY20లో 13 కంపెనీలు, FY21లో 30 ఐపీవోలు వచ్చాయి.

ఐపీవోకు స్పందన అదుర్స్
FY21లో భిన్న రంగాల నుండి ఐపీవోకు వచ్చాయి. గోల్డ్ అండ్ జ్యువెల్లరీ, స్పెషాల్టీ కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ల నుండి వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోవడం కూడా ఇన్వెస్టర్లను ఈక్విటీల వైపు ఆకర్షించాయి. ఎంటార్ టెక్నాలజీస్ ఐపీవోకు రెండువందల రెట్ల స్పందన వచ్చింది. బర్గర్ కింగ్, ఈజీ ట్రిప్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ వంటి ఐపీవోలకు వంద రెట్ల స్పందన లభించింది.

హైదరాబాద్ కంపెనీయే ఎక్కువ
FY21లో వచ్చిన ఐపీవోల్లో చాలా కంపెనీలు మంచి లిస్టింగ్ లాభాలు నమోదు చేశాయి. రూట్ మొబైల్, రోజరీ బయోటెక్, బర్గర్ కింగ్ ఇండియా వంటివి 84 శాతం నుండి 300 శాతానికి పైగా లాభాలను తెచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే గ్లాండ్ ఫార్మా ఒక్కటే రూ.6480 కోట్లను సమీకరించింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ రూ.4633 కోట్లు సమీకరించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications