ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు భారీ లాభాల్లో ముగిశాయి. చివరి సెషన్ (శుక్రవారం)లో 800 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, ఈరోజు దాదాపు 600 పాయింట్ల వరకు లాభపడింది. రెండు రోజుల్లో 1,428 పాయింట్ల మేర ఎగిసింది. అంతకుముందు 6 సెషన్లలో సెన్సెక్స్ 2750 పాయింట్లు నష్టపోయింది. ఆరు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.11 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. అయితే ఈ రెండు రోజుల్లో సగాని కంటే ఎక్కువ లాభం చేకూరింది. వరుసగా రెండు రోజులు భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు మురిసిపోతున్నారు. మొన్న ఐటీ స్టాక్స్, రిలయన్స్, ఆటో వంటివి దోహదపడితే, ఈ రోజు ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాలు చేయూతనిచ్చాయి.

రూ.2.81 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, కరోనా రికవరీలు పెరగడంతో పాటు చైనా ఇండస్ట్రియల్ వరుసగా నాలుగో నెల వృద్ధిని నమోదు చేశాయి. చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్ ఆగస్ట్ నెలలో 19.1 శాతం నమోదయింది. ఇది కూడా మన ఆసియాతో పాటు మన మార్కెట్ పైన ప్రభావం చూపింది. 30 షేర్ ప్యాక్ సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఈ రోజు 2.81 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.155.09 లక్షల కోట్లకు చేరుకుంది.

ప్యాకేజీకి రెడీ..
ఓవైపు అమెరికా కాంగ్రెస్ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూనే, ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దేశీయంగా కూడా ప్రభుత్వం ప్యాకేజీ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పీఎస్యూ బ్యాంకులకు కేంద్రం రూ.20 వేల కోట్ల తాజా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మొన్న మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి.
శుక్రవారం FPIలు రూ.2,080 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ DIIలు రూ.2,071 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

లక్ష్మీ విలాస్ బ్యాంకు అదుర్స్
లక్ష్మీ విలాస్ బ్యాంకులో సంక్షోభం నేపథ్యంలో ఉదయం బ్యాంకు షేర్లు ఆరు శాతం మేర నష్టపోయాయి. ఆ తర్వాత ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో కుదురుకున్నది. సీఈవో, డైరెక్టర్లను తప్పించింది. ఆర్బీఐ డైరెక్టర్లను నియమించింది. దీంతో మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ ఐదు శాతం మేర లాభపడ్డాయి. కాగా, ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ను పోస్ట్ పోన్ చేసింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications