బెంగళూరు: తమ కంపెనీపై వేసిన కొత్త దావా గురించి తమకు తెలియదని ఇన్ఫోసిస్ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఇప్పటికే కంపెనీ నిర్వాహక బృందంలోని కీలక వ్యక్తులపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మళ్లీ కొత్తగా వీరిపై అమెరికాలో కేసు దాఖలు కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ స్పందించింది.
మీడియాలో వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని, వీటిలో అదనంగా మరో దావా దాఖలు కానున్నట్లు వెల్లడించాయి. 24 అక్టోబర్ 2019లో వచ్చిన ఫిర్యాదులు కాకుండా ఇప్పుడు అదనపు ఫిర్యాదులపై కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వడం సహజమేనని పేర్కొంది. దావాలో మరికొందరిని భాగస్వాములను చేసుకునేందుకు ఇలా చేస్తారని, ఇందులో భాగంగా లా ఫర్మ్ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నట్లు తెలిపింది.

కాగా, సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అమెరికాలో మరో దావాను ఎదుర్కోనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై యూఎస్లో క్లాస్ యాక్షన్ లాసూట్ (దావా) దాఖలు కానుందని, లాస్ఏంజిల్స్కు చెందిన వాటాదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ది స్కాల్ లా ఫర్మ్ ఈ లాసూట్ దాఖలు చేస్తోందని వార్తలు వచ్చాయి. స్వల్పకాలానికి ఆదాయ, లాభాలను పెంచి చూపేందుకు కంపెనీ తన ఆర్థిక నివేదికల్లో తప్పుడు లెక్కలు ప్రకటించిందని చెబుతోంది.
కొద్ది రోజుల క్రితం ఇన్ఫోసిస్ పైన విజిల్ బ్లోయర్స్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆంశంపై ఇప్పటికే అమెరికా మార్కెట్ నియంత్రణాధికార సంస్థఎస్ఈసీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే వీరి ఆరోపణల ఆధారంగానే ఈ సంస్థ తాజాగా కంపెనీపై దావాకు సిద్ధమైంది. ఇన్ఫోసిస్ పాటించిన అనైతిక ధోరణలు కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు పేర్కొంది. వాటిని రికవరీ చేయడం కోసం అమెరికాకు చెందిన ఈ సంస్థ లాసూట్ దాఖలు చేస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications