ఇన్ఫోసిస్ లో కీలక ఉద్యోగి రాజీనామా చేశారు. సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. అతను టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేశాయి. మోహిత్ జోషి 2000 నుంచి ఇన్ఫోసిస్లో పని చేస్తున్నారు. తాజాగా మోహిత్ జోషి టెక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.

ఫైనాన్షియల్ సర్వీసెస్
మోహిత్ జోషి మార్చి 11 నుంచి సెలవులో ఉంటారని, కంపెనీలో అతను పని చేసే చివరి తేదీ జూన్ 9, 2023 అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. మోహిత్ జోషి ఇన్ఫోసిస్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెస్కు నేతృత్వం విహించారు. అతను ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్గా కూడా ఉన్నాడు. గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్, ఫినాకిల్ను కలిగి ఉన్న సంస్థ సాఫ్ట్వేర్ వ్యాపారానికి నాయకత్వం వహించాడు.

ఢిల్లీ యూనివర్శిటీ
మోహిత్ జోషి 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్కు ఆహ్వానితులుగా వెళ్లారు. అతను బ్రిటిష్ ఇండస్ట్రీ ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ ఆఫ్ కాన్ఫెడరేషన్ వైస్ ఛైర్, యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో MBA చేసిన జోషి గతంలో ANZ గ్రైండ్లేస్, ABN AMRO వారి కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో పనిచేశారు.

రవి కుమార్
అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. ఇన్ఫోసిస్ కు ఇటీవలి కాలంలో రాజీనామా చేసిన కీలక ఉద్యోగుల్లో జోషి ఒకరు. గత సంవత్సరం కంపెనీకి ప్రెసిడెంట్ గా ఉన్న రవి కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం రవి కుమార్ కాగ్నిజెంట్ లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications