గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గాను ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.46.12 కోట్ల (6.1 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. బోనస్, ప్రోత్సాహకాలు, స్టాక్ యూనిట్స్ అన్నీ కలుపుకొని 27 శాతం పెరిగి రూ.46 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది (2018-19) ఆయన వేతనం రూ.4.8 మిలియన్లుగా ఉంది. ఈ మేరకు కంపెనీ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC)కు కంపెనీ ఫామ్ 20ఎఫ్ దాఖలు చేసింది.

వేతనాలు ఇలా
సలీల్ పరేఖ్ వేతనం 8,01,264 డాలర్లు కాగా, 15,40,305 డాలర్లు బోనస్, ప్రోత్సాహకాలని ఇన్ఫోసిస్ తెలిపింది. కంపెనీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వేతనం 29 శాతం పెరిగి 2.3 మిలియన్ డాలర్లు (రూ.17.3 కోట్లు), ప్రెసిడెంట్స్ రవికుమార్, మోహిత్ జోషి రెమ్యునరేషన్ వరుసగా 25 శాతం పెరిగి 3 మిలియన్ డాలర్లు, 24.6 శాతం పెరిగి 3.2 మిలియన్ డాలర్లుగా ఉంది. సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ 1.5 మిలియన్ డాలర్ల (రూ.11.3 కోట్లు) వేతనం అందుకున్నారు.

గతంలో కంటే ఎంత పెరిగిందంటే
సలీల్ పరేఖ్ వేతనం 2018-19లో 4.8 మిలియన్ డాలర్లు కాగా, 2019-20లో 6.1 మిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా ప్రవీణ్ రావు రెమ్యునరేషన్ 1.7 మిలియన్ డాలర్ల నుండి 2.2 మిలియన్ డాలర్లకు, నీలాంజన్ రాయ్ 0.3 మిలియన్ డాలర్ల నుండి 1.5 మిలియన్ డాలర్లకు, మోహిత్ జోషి 2.6 మిలియన్ డాలర్ల నుండి 3.2 మిలియన్ డాలర్లకు, రవి కుమార్ 2.4 మిలియన్ డాలర్ల నుండి 3 మిలియన్ డాలర్లు, కృష్ణమూర్తి శంకర్ (గ్రూప్ హెచ్ఆర్ హెడ్) 0.8 మిలియన్ డాలర్ల నుండి 1 మిలియన్ డాలర్లకు పెరిగింది.

శాలరీ పెరగడం వల్ల లాభం తగ్గింది..
వేతనాల పెరుగుదల వల్ల కంపెనీ లాభదాయకత తగ్గిందని, హెచ్1బీ వీసాల కోసం అధిక వ్యయాలు, క్రాస్ కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా ప్రభావం చూపాయని ఇన్ఫోసిస్ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇన్ఫోసిస్ లాభదాయకత స్వల్పంగా తగ్గవచ్చునని తెలిపింది. కరోనా నేపథ్యంలో కొంతమంది క్లయింట్స్ రాయితీలు కోరుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు, రిటైల్, కన్స్యూమర్ గూడ్స్, ఇంధనం, తయారీ రంగాలపై కరోనా 19 ప్రభావం అధికంగా ఉందని, దీని వల్ల ఈ రంగ సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించుకోవాలని, కాంట్రాక్టులు రద్దు చేసుకునే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఇన్ఫోసిస్ పైన ఉండవచ్చునని అంచనా వేసింది.

పెరిగిన రెవెన్యూ
తమ ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ఒక్కో ఉద్యోగిపై రెవెన్యూ 2019లో 54,0.8 కాగా 2020 నాటికి 54,142గా ఉన్నట్లు తెలిపింది. హైరింగ్ సబ్ కాంట్రాక్ట్స్, టెంపరరీ స్టాఫ్ పైన 945 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాదిలో ఇది 860 మిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొంది. మార్చి 31వ తేదీ నాటికి అమెరికాలో 50 శాతం కంటే తక్కువ ఉద్యోగులు హెచ్1బీ, ఎల్1 వీసా కలిగి ఉన్నవారు ఉన్నారని తెలిపింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications