2021 పసిడి దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా జంప్
భారత్ బంగారం దిగుమతులు 2021 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. కరోనా కారణంగా 2020లో 430.11 టన్నులకు పడిపోయిన దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ మేరకు జెమ్స్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) గురువారం తెలిపింది. కరోనా ముందు 2019 క్యాలెండర్ ఏడాదితో పోల్చినా పసిడి దిగుమతులు 836.38 టన్నుల నుండి 27.66 శాతం పెరిగి, 1067.72 టన్నులకు చేరుకున్నాయి.
అత్యధికంగా స్విట్జర్లాండ్ నుండి 469.66 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. ఆ తర్వాత యూఏఈ నుండి 120.16 టన్నులు, సౌత్ ఆఫ్రికా నుండి 71.68 టన్నులు, గినియా నుండి 58.72 టన్నులు ఉన్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పసిడి దిగుమతులు చేసుకునే దేశం భారత్. 2015లో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య నెలవారీ సగటు పసిడి దిగుమతులు 76.57 టన్నులుగా నమోదయ్యాయి.