India Plan: ప్రస్తుతం ఉన్నది నవభారతం. ప్రపంచ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. చైనా నుంచి ఫ్యాక్టరీలను లాక్కోవటానికి భారత్ భారీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లక్ష్యం అదే..
ఈ పోర్టల్ పెట్టుబడిదారులు, కంపెనీలకు ప్రాజెక్ట్ల రూపకల్పన, ఆమోదాల విషయంలో ఖర్చులను భారీగా తగ్గించే వన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. సమయాన్ని ఆదా చేయటంతో పాటు వ్యయాన్ని తగ్గిస్తూ ప్రాజెక్టులను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని లాజిస్టిక్స్ ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా తెలిపారు. తద్వారా భారతదేశాన్ని గ్లోబల్ కంపెనీలు తయారీ కేంద్రంగా ఎంచుకునేలా చేయటం లక్ష్యమని అన్నారు.

చైనాతో పోటీపడేందుకు..
ప్రస్తుతం అనేక కంపెనీలు చైనాతో పాటు మరో దేశంలో తమ ప్లాంట్లను పెట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ ఆసియాలో చౌక కార్మికులు, ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగులు, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తోంది. చైనాతో పోటీపడటానికి ఇది ఏకైక మార్గంగా ఉంది. గతి శక్తి ద్వారా దేశంలోని నలుమూలలకు వస్తువులు, ఇతర తయారీ భాగాల రవాణాను సులభతరం చేయటమే. తాజాగా భారత ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకురావటం ఇందుకు మరింతగా దోహదపడుతుంది.

లాజిస్టిక్స్ నెట్వర్క్..
ఉత్పత్తి క్లస్టర్లకు రైల్వే నెట్వర్క్, పోర్ట్లు, విమానాశ్రయాలకు లింక్ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య స్తంభాలు. గతిశక్తి క్షేత్ర స్థాయిలో నోడ్లను కనెక్ట్ చేసే లాజిస్టిక్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడంతో రూపొందించబడింది. గతి శక్తి పోర్టల్ ప్రస్తుతం 1,300 ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోంది. వీటిని ముందుకు తీసుకెళ్లటంలో అటవీ, పర్యావరణ, భూ సేకరణ వంటి సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నింటిని పోర్టల్ పరిష్కరించింది.

చైనా TO ఇండియా..
ప్రస్తుతం ఐఫోన్ 14 తయారీని భారత్ లో చేపట్టాలని ఆపిల్ కంపెనీ యోచిస్తోంది. 2018లో శాంమ్ సంగ్ కంపెనీ తన మెుబైల్ తయారీ యూనిట్ ను మన దేశంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఓలా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని స్థానికంగా నిర్మిస్తామని తెలిపింది. అలాగే అనేక ఇతర రంగాల్లోని కంపెనీలు ప్రస్తుతం భారత దేశంలో పెట్టుబడులను, తయారీ యూనిట్లను పెడుతున్నాయి. వీటికి అవసరమైన అన్ని సదుపాయాలను భారత ప్రభుత్వం వేగంగా సమకూర్చుతోంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications