అహ్మదాబాద్: ఇంధన రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ ఎనిమిదవ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇంధనరంగంలో సూపర్ పవర్గా నిలబెట్టాలని, ఆర్థిక వ్యవస్థ పరంగానే కాకుండా స్వచ్ఛ ఇంధనం విషయంలోను భారత్ బలంగా ఎదగాలని అన్నారు. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ సాంకేతికతల్లో ఇంధన నిల్వ, వినియోగంలో కొత్త పరిష్కారాలను అన్వేషించాలన్నారు.

సంపన్నదేశంగా భారత్
ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణకు సంబంధించి వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ముఖేష్ అంబానీ సూచించారు. భారత్ను ఆర్థిక, ఇంధనరంగాల్లో అగ్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలన్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ ఇంధన వినియోగం ఇప్పుడు ఉన్న దాంతో పోలిస్తే రెట్టింపు అవుతుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ ఇంధన విషయంలో బలమైన శక్తిగా ఎదగాలన్నారు.
ఇంధన రంగంలో ఊహించని మార్పులు ఉన్నాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఇంధన విప్లవాన్ని అనుసంధానించడంలో భారత్ విజయవంతమైతే ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు.

కరోనాపై అలసత్వం వద్దు
కరోనా తర్వాత ఆర్థికంగా భారత్కు ఎధుగుతుందని ముఖేష్ అన్నారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు స్థాపించే స్టార్టప్స్ కంపెనీలే వృద్ధికి చోదక శక్తిగా మారుతాయన్నారు. వచ్చే ఇరవై ఏళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఎదురైనా అధిగమించి ముందుకెళ్లే శక్తి భారత్కు, భారతీయులకు ఉందన్నారు. కరోనాతో పోరాటంలో కీలక దశలో ఉన్నామని, ఈ దశలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు.

ప్రధానిపై ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీపై ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. ఆయన బోల్డుగా తీసుకుంటున్న సంస్కరణలు భారత్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాయన్నారు. ప్రధానిలో ఉన్న నమ్మకం, భారత్కు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఈ సంస్కరణలు వేగవంతమైన భారత వృద్ధికి అవకాశం కల్పిస్తాయన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications