అహ్మదాబాద్: ఇంధన రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ ఎనిమిదవ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇంధనరంగంలో సూపర్ పవర్గా నిలబెట్టాలని, ఆర్థిక వ్యవస్థ పరంగానే కాకుండా స్వచ్ఛ ఇంధనం విషయంలోను భారత్ బలంగా ఎదగాలని అన్నారు. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ సాంకేతికతల్లో ఇంధన నిల్వ, వినియోగంలో కొత్త పరిష్కారాలను అన్వేషించాలన్నారు.

సంపన్నదేశంగా భారత్
ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణకు సంబంధించి వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ముఖేష్ అంబానీ సూచించారు. భారత్ను ఆర్థిక, ఇంధనరంగాల్లో అగ్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలన్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ ఇంధన వినియోగం ఇప్పుడు ఉన్న దాంతో పోలిస్తే రెట్టింపు అవుతుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ ఇంధన విషయంలో బలమైన శక్తిగా ఎదగాలన్నారు.
ఇంధన రంగంలో ఊహించని మార్పులు ఉన్నాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఇంధన విప్లవాన్ని అనుసంధానించడంలో భారత్ విజయవంతమైతే ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు.

కరోనాపై అలసత్వం వద్దు
కరోనా తర్వాత ఆర్థికంగా భారత్కు ఎధుగుతుందని ముఖేష్ అన్నారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు స్థాపించే స్టార్టప్స్ కంపెనీలే వృద్ధికి చోదక శక్తిగా మారుతాయన్నారు. వచ్చే ఇరవై ఏళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఎదురైనా అధిగమించి ముందుకెళ్లే శక్తి భారత్కు, భారతీయులకు ఉందన్నారు. కరోనాతో పోరాటంలో కీలక దశలో ఉన్నామని, ఈ దశలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు.

ప్రధానిపై ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీపై ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. ఆయన బోల్డుగా తీసుకుంటున్న సంస్కరణలు భారత్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాయన్నారు. ప్రధానిలో ఉన్న నమ్మకం, భారత్కు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఈ సంస్కరణలు వేగవంతమైన భారత వృద్ధికి అవకాశం కల్పిస్తాయన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications