చైనా పెట్టుబడులను భారత ప్రభుత్వం సులభతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలుగా నిబంధనలను సులభతరం చేయాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భారత్.. డ్రాగన్ దేశ పెట్టుబడులపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రూ.45వేల కోట్ల పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
చైనీస్ పెట్టుబడులపై నియంత్రణలను సడలించాలని భారత్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోందని బ్లూమ్బర్గ్ న్యూస్ మంగళవారం నివేదించింది. ప్రస్తుతం భారత్తో భూసరిహద్దును పంచుకునే దేశాల్లోని కంపెనీల నుండి పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అంటే అవి ఆటోమేటిక్గా రావడం కుదరదు. విదేశీ యాజమాన్యం 10 శాతం కంటే తక్కువగా ఉన్న కంపెనీల ప్రతిపాదనలను మినహాయించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందని పేర్కొంది.

ఆరు బిలియన్ డాలర్లు లేదా రూ.45వేల కోట్ల పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను వచ్చే నెల ప్రారంభంలో ఆమోదించవచ్చునని భావిస్తున్నారు. 2020లో భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇరువైపుల సైనికులు మృత్యువాత పడ్డారు. దీంతో చైనాపై గుర్రుగా ఉన్న మోడీ ప్రభుత్వం ఆ దేశ కంపెనీలపై పరోక్షంగా ఆంక్షలు విధించింది. దేశంలో సున్నితమైన రంగాలలో చైనా పెట్టుబడులను పరిమితం చేయాలని అప్పుడే నిర్ణయించింది. చైనా మొబైల్ యాప్స్పై చర్యలు, చైనా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications