2047 నాటికి అమెరికా, చైనాల సరసన సంపన్న దేశంగా భారత్ చేరుకుంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఇదే లక్ష్యంగా మనం పని చేయాలన్నారు. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్.. అమెరికా, చైనాల కంటే సంపన్న దేశంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్ల క్రితం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు అసామాన్యమైనవన్నారు. అయితే ఈ సంస్కరణల ఫలాలు దేశంలోని ప్రజలందరికీ దక్కలేదన్నారు. అట్టడుగు వర్గాల్లో సంపద సృష్టి జరిగేలా భారతీయ నమూనాను అభివృద్ధి చేయాలని ఓ ఆంగ్ల పత్రికు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

సంస్కరణల ఫలితం
పీవీ నరసింహారావు 1991లో చేపట్టిన సంస్కరణలను ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ దిశ, గమ్యాన్ని మార్చేలా దూరదృష్టితో కూడిన నిర్ణయాలను తీసుకున్నారని, నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రభుత్వ రంగానికి సమానంగా ప్రయివేటు రంగానికి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కల్పించిందన్నారు. లైసెన్స్ రాజ్కు ముగింపు పలికారన్నారు. పారిశ్రామిక విధానాలను సరళీకరించినట్లు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్స్, ఆర్థిక రంగాల్లో సామర్థ్యాలు పెంపొందించే సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఈ సంస్కరణలు ప్రపంచంలో భారత్ అయిదో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. 1991లో నుండి జనాభా పెరిగినప్పటికీ పేదరికం రేటు సగానికి తగ్గిందని, ఇది సంస్కరణల ఫలితమే అన్నారు.

విదేశీ మారక నిల్వలు
1991లో భారత జీడీపీ 26,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని, ఇప్పుడు పది రెట్లు పెరిగి 2.87 లక్షల డాలర్ల స్థాయికి చేరుకుందని ముఖేష్ అంబానీ అన్నారు. విదేశీ మారక ద్రవ్యం కోసం వెతుకులాడే పరిస్థితి నుండి 61,200 కోట్ల డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. 2051 నాటికి భారత్ ఆర్థిక సమానత్వం కలిగిన ప్రపంచ సంపన్న దేశంగా మారాలన్నారు.

వేగంగా వృద్ధి చెందుతూ..
తక్కువ సాంకేతికతో కూడిన కార్యకలాపాల్లో భారత్ అత్యంత వినూత్న దేశమన్నారు. శరవేగ వృద్ధికి దోహదపడేలా ఆధునిక సాంకేతిక వినియోగంలోను ఈ శక్తి సామర్థ్యాల్ని పదర్శించాల్సిన ఉందని చెప్పారు. అత్యుత్తమ నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో సేవలు, ఉత్పత్తులను అందించేందుకు ఆవిష్కరణలు తోడ్పడ్డాయని తెలిపారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications