Mutual Funds: లక్షలను కోట్లుగా మార్చిన మ్యూచువల్ ఫండ్.. సూపర్ రిటర్న్స్.. SIP ఇన్వెస్టర్లు..
Mutual Funds: ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరిలో చాలా మంది రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.
మ్యూచువల్ ఫండ్స్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ గురించే. పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించటం ద్వారా అతిపెద్ద సంస్థ అనేక మందిని కోటీశ్వరులుగా మార్చింది. 18 సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ వాల్యూ డిస్కవరీ ఫండ్లో 10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రస్తుతం దాని విలువ రూ.2.5 కోట్లకు చేరుకుంది. ఈ ఫండ్ 18 ఏళ్ల కిందట ప్రారంభించబడింది.
2004లో ఫండ్ ప్రారంభం..
ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఆగస్ట్ 16, 2004న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫండ్ వార్షికంగా 19.7 శాతం CAGR చొప్పున రాబడిని అందిస్తోంది. అందుకే అప్పట్లో 10 లక్షల పెట్టుబడి ప్రస్తుతం రూ.2.5 కోట్లుగా మారింది. అదే రూ.10 లక్షలు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని రాబడి 15.6 శాతం CAGR ఉన్నందున రాబడి దీనికంటే తక్కువగానే ఉండేది. అంటే.. ఈ లెక్కన రూ.1.3 కోట్లు అయ్యేది.
ఫండ్ విలువ రూ. 25 వేల కోట్లు..
జూలై 31, 2022 నాటికి ఈ ఫండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్(AUM) రూ. 24,694 కోట్లుగా ఉంది. ఈ కేటగిరీలోని మొత్తం AUMలలో ఈ ఫండ్ హౌస్ వాటా 30 శాతంగా ఉంది. ఇది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో నుంచి స్టాక్లలో పెట్టుబడి పెడుతుంది. ఇవి ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్లో కానీ తగ్గింపుతో ఉంటాయి.
SIP పెట్టుబడుల రాబడులు..
IPru విలువ డిస్కవరీ ఫండ్ SIP పెట్టుబడులలో మంచి రాబడిని ఇచ్చింది. ప్రారంభించినప్పటి నుంచి ప్రతినెలా ఎవరైనా రూ.10 వేలు ఎస్ఐపీ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ ప్రస్తుతం రూ.1.2 కోట్లకు చేరుకునేది. సదరు ఇన్వెస్టర్ ఇందుకోసం పెట్టుబడి రూపంలో దాదాపుగా రూ.21.6 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఉంటాడు. గడచిన మూడేళ్ల కాలంలో ఈ ఎస్ఐపీ 27.59 శాతం రాబడిని అందించింది.
ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షణ..
గత కొన్ని సంవత్సరాలుగా విలువ పెట్టుబడిలో భారతీయ పెట్టుబడిదారుల ఆకర్షణ పెరిగిందని ICICI ప్రుడెన్షియల్ MD & CEO నిమేష్ షా అన్నారు. భారతీయులు ప్రతిదానిలో విలువను చూసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా మన జీవితాల్లో విలువ పెట్టుబడి మరింత పెరుగుతుందని మేము నమ్ముతున్నామన్నారు. ఓపికగా ఉన్న పెట్టుబడిదారుడికి చాలా కాలం పాటు వాల్యూ ఇన్వెస్టింగ్ బాగా పని చేస్తుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలని S Naren, CIO అభిప్రాయపడ్డారు.