న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ దెబ్బ తీవ్రంగా పడుతోంది. అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించడం, వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ను సైతం అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. రవాణా, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని ఊరడింపు చర్యలను చేపడుతోంది. ప్రత్యేకించి- పన్నుచెల్లింపుదారులు, కన్సల్టెంట్లకు ఊరట కల్పించింది. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ (TDS) కింద దాఖలు చేయాల్సి ఉన్న పలు ప్రతిపాదనలకు సంబంధించిన డెడ్లైన్లను నెలరోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు వాటిని దాఖలు చేయడానికి వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే నోటీసులు అందుకున్న, ఆదాయపు పన్ను కమిషనర్ల వద్ద అప్పీల్ చేయదలిచిన, వివాదాలను పరిష్కరించడానికి ఏర్రపాటు చేసిన ప్యానెళ్ల వద్ద తమ క్లెయిమ్లను ఈ నెల 31వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చని సీబీడీటీ వెల్లడించింది. అలాగే ట్యాక్స్ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేయడానికి, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ రిటర్న్లను క్లెయిమ్ చేసే వారిని కూడా ఈ పొడిగింపు పరిధిలోకి తీసుకొచ్చింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications