పెరిగిన బంగారం ధరలు, పెట్రోల్-డీజిల్ ధరలు యథాతథం
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 పెరిగింది. దీంతో బంగారం రూ.36,250కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 పెరిగింది. దీంతో రూ.39,600కు చేరుకుంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్, దేశీయ జ్యువెల్లర్స్ నుంచి, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.46,800కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఔన్స్ 0.01 శాతం పెరిగింది. 1,480 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి 17.06 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర సెప్టెంబర్ నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఔన్సు బంగారం 1,550 డాలర్లకు చేరుకుంది. నాటితో పోలిస్తే భారీగా అంటే ఏకంగా 70 డాలర్లు దిగి వచ్చింది.
FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్
మరోవైపు, ఇంధన ధరలు మంగళవారం నాటితో యథాతథంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.74.63, కోల్కతాలో రూ.77.29, ముంబైలో రూ.80.29, చెన్నైలో రూ.77.58, బెంగళూరులో రూ.77.18, హైదరాబాదులో రూ.79.42గా ఉంది. డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.66.04, కోల్కతాలో రూ.68.45, ముంబైలో రూ.69.27, చెన్నైలో రూ.69.81, బెంగళూరులో రూ.68.29, హైదరాబాదులో రూ.72.07గా ఉంది.