రెండోరోజు తగ్గిన బంగారం ధర, ఏడాదిలో రూ.11,000 పెరిగిన ధర
బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.15% తగ్గి రూ.43,676 వద్ద, కిలో వెండి ధర 0.16% తగ్గి రూ.46,198 వద్ద నిలిచింది. అంతకుముందు సెషన్లో కూడా బంగారం ధరలు భారీగానే తగ్గాయి. బంగారం కొనుగోలు చేస్తే 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది.
వచ్చే నెలలో రూ.50,000కు బంగారం ధర! కారణాలివే: కొనుగోలు చేయవచ్చా?
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% తగ్గి 1,656.37 డాలర్లుగా ఉంది. అంతకుముందు సెషన్లో రెండు శాతం పడిపోయింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. ఔన్స్ వెండి 1.3 శాతం పెరిగి 17.08 డాలర్లుగా ఉంది. ప్లాటినమ్ ధర 0.8 శాతం పెరిగి 875.37 డాలర్లుగా ఉంది. బంగారం ధర రూ.44,000 దిశగా వెళ్తోందని, రూ.43,500 మద్దతు ధర అని చెబుతున్నారు. వెండి మద్దతు ధర కిలో రూ.46,200గా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.33వేలు ఉన్న బంగారం ఏడాది తిరిగేసరికి రూ.44వేల పైకి చేరుకుంది. దాదాపు 11వేలకు పైగా పెరిగింది.
కాగా,
గత
ఏడాది
కాలంలో
బంగారం
పెరిగిందిలా..
బంగారం
ధరలు
ఏడాది
వ్యవధిలోనే
భారీగా
పెరిగాయి.
2019
జనవరిలో
రూ.33056
ఫిబ్రవరిలో
రూ.32981
మార్చిలో
రూ.31734
ఏప్రిల్లో
రూ.31756
మేలో
రూ.32098
జూన్లో
రూ.34206
జూలైలో
రూ.34517
ఆగస్ట్లో
రూ.38656
సెప్టెంబర్లో
రూ.36913
అక్టోబర్లో
రూ.38578
నవంబర్లో
రూ.38031
డిసెంబర్లో
రూ.39108
2020
జనవరిలో
రూ.41000
ఫిబ్రవరి
24వ
తేదీ
నాటికి
రూ.44,472గా
ఉంది.