న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. తమ దూకుడును కొనసాగిస్తూనే పోతోన్నాయి. ఇంధన ధరల తగ్గింపు విషయాన్ని దాదాపు మర్చిపోయినట్టే కనిపిస్తోన్నాయి. కిందటి నెల 4వ తేదీన ఏ ముహూర్తంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు పూనుకున్నాయో గానీ.. దానికి ఎక్కడా బ్రేకులనేవే పడట్లేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్ను దాటేసింది. ఇక డీజిల్ వంతు వచ్చింది. డీజిల్ రేటు కూడా లీటర్ ఒక్కింటికి 100 రూపాయల మార్క్ను దాటేసింది. పెట్రోల్ రేటు 107కు చేరింది.

పెట్రోల్పై 27, డీజిల్పై 23
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 27 పైసలు, డీజిల్ 23 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.96.12, డీజిల్ 86.98 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 102 మార్క్ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.102.30 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 94.39కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 97.43, డీజిల్ ధర రూ. 91.64, కోల్కతలో పెట్రోల్ రూ.96.06 పైసలు, డీజిల్ ధర రూ.89.83 పైసలు పలుకుతోంది. భోపాల్లో పెట్రోల్-104.29, డీజిల్-95.60 రూపాయలకు చేరింది.

శ్రీగంగానగర్లో రికార్డ్..
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పెట్రోల్ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు చేరింది. మధ్యప్రదేశ్లోని అనూప్పూర్లో రూ.106.87, మహారాష్ట్రలోని పర్భణీలో 104.64, రాజస్థాన్ రాజధాని జైపూర్లో 102.73 పైసలుగా నమోదైంది. శ్రీగంగానగర్లో డీజిల్ ఏకంగా 100.05 పైసలకు చేరింది. డీజిల్ ధర వంద రూపాయల మార్క్ను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. చమురు సంస్థలు ఇప్పుడు ప్రదర్శిస్తోన్న దూకుడు ఇదే తరహాలో కొనసాగిస్తే.. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ డీజిల్ ధర వంద రూపాయల మార్క్ను దాటడానికి ఎన్నో రోజుల పట్టకపోవచ్చు.

అనేక నగరాల్లో ఇదే పరిస్థితి..
అనూప్పూర్లో డీజిల్ రేటు రూ.97.98 పైసలు ఉంటోంది. శ్రీగంగానగర్, అనూప్పూర్, నగరాబంధ్, పర్భణీల్లో పెట్రోల్ రేటు తొలిసారిగా వంద రూపాయలు దాటేశాయి. ఇప్పుడా బాధ్యతను డీజిల్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో 102 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్వారా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల వంద రూపాయలను దాటేసింది.
More From GoodReturns

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications