నవంబర్ నెలలో ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్(FPI)లు పెద్ద ఎత్తున వచ్చాయి. కరోనా తర్వాత ఇప్పుడు ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. వ్యాక్సీన్ పైన ప్రకటనల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఈ సమయంలో FPIలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. నవంబర్ నెలలో రూ.62,951 కోట్ల FPIలు వచ్చాయి. వరుసగా రెండో నెల కొనుగోళ్లు నమోదు చేశాయి.

మొత్తం పెట్టుబడులు ఇలా
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారుల డేటా ప్రకారం ఈక్విటీ విభాగంలో నవంబర్ నెలలో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. భారత మార్కెట్లోకి అక్టోబర్ నెలలో వచ్చిన FPIలు రూ.22,033 కోట్లు. నవంబర్ 3వ తేదీ నుండి 27వ తేదీ మధ్య వచ్చిన నికర FPIలు రూ.60,358 కోట్లు. డెట్ విభాగంలో రూ.2,593 కోట్లు వచ్చాయి. మొత్తం నికర పెట్టబడులు రూ.62,951 కోట్లు.

ఈ దేశాల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల ఆసక్తి
పెట్టుబడిదారులు అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారని గ్రో సీవోవో, కో-ఫౌండర్ హర్ష్ జైన్ అన్నారు. దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లోను ఈ ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రధానంగా బ్లూచిప్స్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

నవంబర్ నెలలో అందుకే
నవంబర్ నెలలో పెట్టుబడులు భారీగా పెరగడానికి ప్రధాన కారణాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులతో పాటు అమెరికా డాలర్ బలహీనత అని గుర్తు చేస్తున్నారు. అలాగే, దేశంలో కరోనా కేసులు తగ్గిపోవడం, రికవరీ వేగవంతంగా ఉండటం కలిసి వచ్చిందని చెబుతున్నారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
More From GoodReturns

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications