Raghram Rajan: అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా రీసెర్చ్ సంస్థ సంచలన రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత పరిస్థితులు పూర్తింగా మారిపోయాయి. ఆ విధ్వంసం నుంచి గ్రూప్ కంపెనీలు ఇప్పుడిప్పుతే తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో వ్యవహారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గపడకు చేరుకుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
పన్నులను తప్పించుకునేందుకు చాలా మంది మారిషల్, కేమన్ ఐలాండ్ వంటి చోట్ల డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేస్తుంటారని ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈడీ లాంటి సంస్థలు గుర్తించాయి. అయితే అదానీ గ్రూప్కు సంబంధించిన కేసులో మారిషస్కు చెందిన అనుమానాస్పద సంస్థల యాజమాన్యంపై ఇంకా విచారణ చేయకపోవటంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. నాలుగు మారిషస్ ఆధారిత ఫండ్స్ తమ మెుత్తం 6.9 బిలియన్ డాలర్ల మూలధనంలో 90 శాతం డబ్బును అదానీ గ్రూప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోందని.. ఈ విషయంలో ఎలాంటి విచారణ జరగనప్పుడు.. దీనికి కూడా దర్యాప్తు సంస్థల సహాయం సెబీకి అవసరమా అని ప్రశ్నించారు.

బూటకపు కంపెనీలకు డబ్బు మళ్లించి వాటిని తిరిగి దేశంలోకి తెచ్చారన్నది అమెరికా రీసెర్చ్ సంస్థ చేసిన అతిపెద్ద ఆరోపణల్లో ఒకటి. మారిషస్కు చెందిన ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, క్రెస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్.. షెల్ కంపెనీలని ఆరోపణలు రావడంతో గత రెండేళ్లుగా స్కానర్లో ఉంది. అదానీ గ్రూప్ తన షేర్ల ధరను పెంచేందుకు షెల్ కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంతో గత ఏడాది జనవరిలో ఈ కంపెనీలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications