కరోనా మహమ్మారి కారణంగా భారత వృద్ధి రేటుపై భారీ ప్రభావం పడనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోనుంది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. గత ఏడాది మందగమనం కారణంగా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత కరోనా - లాక్ డౌన్ కారణంగా భారీగా దెబ్బతిన్నది.

భారీగా పడిపోయిన వృద్ధి రేటు
జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్యకలాపాలు బాగానే ఉన్నాయని, కానీ ఆ తర్వాత కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రభావం పడిందని హెచ్ఎస్బీసీ ఎకనమిస్ట్ ఆయుష్ చౌదరి అన్నారు. మే 20 నుండి 25 మధ్య పోల్ ద్వారా 52 ఆర్థికవేత్తల నుండి తీసుకున్న అభిప్రాయం ప్రకారం మార్చిలో వృద్ధి రేటు 2.1 శాతంగా ఉంది. ఇది 2012 నుండి అత్యంత బలహీన వృద్ధి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు మూడు త్రైమాసికాల 4.7 శాతం వృద్ధి రేటు కంటే పడిపోయిందని వెల్లడించారు.

లాక్ డౌన్ తర్వాత..
జీడీపీ వృద్ధి రేటు అంచనాకు సంబంధించిన డేటా మే 29న విడుదల కానుంది. ఇది 4.5 శాతం నుండి మైనస్ 1.5 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పోల్లో పాల్గొన్న ఆరుగురు ఆర్థికవేత్తలు జీడీపీ తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు సూచీలు జనవరి - మార్చి జీడీపీపై గణనీయ ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. మార్చి చివరలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత గత ఆర్థిక వ్యవస్థ కుదించికుపోతుందని భావిస్తున్నట్లు సింగపూర్ క్యాపిటల్ ఎకనమిక్స్కు చెందిన ఇండియా సీనియర్ ఎకనమిస్ట్ షిలాన్ షా అన్నారు.

నాలుగు దశాబ్దాల భారీగా కుంచించుకుపోతుంది
కరోనా వల్ల సుదీర్ఘ ఆంక్షలతో పాటు పరిమిత ప్యాకేజీ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తర్వాత భారీగా కుంచించుకుపోనుందని షిలాన్ షా చెప్పారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై ఈ పోల్లో పాల్గొన్న కొందరు ఆర్థికవేత్తలు స్పందిస్తూ.. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారని, ఇది క్రెడిట్ లభ్యతను పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్యాకేజీ సమీప కాలంలో డిమాండ్ను పూరించే కంటే దీర్ఘకాలంలో బాగా ఉపయోగపడుతుందని పాంథియోన్ మ్యాక్రో ఎకనమిక్స్ చీప్ ఏసియా ఎకనమిస్ట్ ప్రెయా బీమిష్ అన్నారు. మే చివరి వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తోందన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications