ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(నవంబర్ 20) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో కాస్త నష్టాల్లోకి వెళ్లినప్పటికీ అంతకుమించి ఎగిశాయి. ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. ఉదయం గం.11 సమయానికి 43,830 పాయింట్లను తాకినప్పటికీ, కాసేపటికే నిన్నటి ముగింపు 43,600 కంటే దిగువకు చేరుకొని, 43,480 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం చివరి గంటలో కొనుగోళ్లు పెరిగి భారీ లాభాలు నమోదు చేశాయి. ఓ సమయంలో 44 వేల మార్క్ సమీపానికి చేరుకొని, చివరకు 282 పాయింట్ల లాభంతో ముగిసింది.

రిలయన్స్ స్టాక్ భారీ పతనం
ఈ రోజు నిఫ్టీ 87.30 పాయింట్లు(0.68 శాతం) లాభపడి 12,859 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 282.29 పాయింట్లు(0.65%) ఎగిసి 43,882.25 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎగిశాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 9.19 శాతం, టైటాన్ కంపెనీ 5.62 శాతం, గెయిల్ 4.06 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.95 శాతం, కొటక్ మహీంద్ర 3.45 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 3.73 శాతం, అదానీ పోర్ట్స 1.58 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.86 శాతం, సన్ ఫార్మా 0.81 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.78 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీగా పతనమైంది. ఏకంగా రూ.1900 దిగువకు చేరుకుంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 3.66 శాతం లేదా రూ.72 పడిపోయి రూ.1901 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.70 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.19 శాతం, నిఫ్టీ ఐటీ 1.40 శాతం, నిఫ్టీ మెటల్ 0.80 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.84 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ మీడియా 0.92 శాతం, నిఫ్టీ ఫార్మా 0.34 శాతం నష్టపోయాయి.
బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలు ఎగిశాయి. ఫార్మా, మీడియా మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.
బజాజ్ ఫిన్ సర్వ్ 9 శాతం, టైటాన్ 5 శాతం మేర లాభపడటం గమనార్హం.
సెన్సెక్స్ 30లో 21 స్టాక్స్ లాభపడ్డాయి.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్స్ నేడు మరో 10 శాతం పడిపోయి రూ.9కి క్షీణించాయి. వరుసగా రెండు రోజులు 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం, నేడు 10 శాతం తగ్గాయి.

ఐటీ స్టాక్స్ అదుర్స్
ఐటీ స్టాక్స్లో టీసీఎస్ 0.79 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.92 శాతం, ఇన్ఫోసిస్ 0.70 శాతం, టెక్ మహీంద్ర 1.83 శాతం, విప్రో 1.28 శాతం, మైండ్ ట్రీ 3.01 శాతం, కోఫోర్జ్ 0.97 శాతం లాభపడ్డాయి. యూఎస్ ట్రెజరీ అత్యవసర రుణ కార్యక్రమాలను ముగించినట్లు వార్తలు రావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం నిలిచిపోయాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications