China Companies: భారత కంపెనీల మాటున చైనా చేస్తున్న కుట్రలు బయటపడ్డాయి. చైనాకు చెందిన పలు నకిలీ కంపెనీలు భారత్లో రిజిస్టర్ చేసి మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అలా వ్యాపారాలను నిర్వహించి టాక్సులు చెల్లించకుండా, యాప్స్ అధిక వడ్డీలకు లోన్స్ వంటి విషయాలపై చేస్తున్న దర్యాప్తులో తవ్వినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

నకిలీ కంపెనీలు ఎక్కడంటే..
చైనా కంపెనీలు ప్రధానంగా ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నకిలీ కంపెనీల కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కొద్ది రోజుల క్రితం విచారణ ప్రారంభించింది.

ఎక్కువ కంపెనీలు తెలంగాణలో..
హర్యానాలోని గుర్గావ్లోని జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులోని బెనింటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లోని హుసిస్ కన్సల్టింగ్ లిమిటెడ్, తెలంగాణలోని 32 చైనా సంస్థలపై అధికారులు గత కొద్ది రోజులుగా దాడులు నిర్వహించారు.

అసలు సూత్రధారి అతడే..
ఈ దర్యాప్తులో మోసపూరితంగా సృష్టించిన చాలా కంపెనీలు నకిలీవని అధికారులు గుర్తించారు. అతి సాధారణ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులనే ఈ కంపెనీలకు డైరెక్టర్లుగా నియమించినట్లు బట్టబయలైంది. ఈ మోసానికి సూత్రధారి డార్ట్సే అనే వాస్తవం వెలుగులోకి వచ్చింది. అతను బీహార్కు పారిపోయాడని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చైనాకు పారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

డార్ట్సే అరెస్ట్..
నిందితుడు పారిపోవాలనుకుంటున్న వ్యవహారం తెలుసుకున్న అధికారులు శనివారం బీహార్ వెళ్లి అధికారులు డార్ట్సేను అదుపులోకి తీసుకున్నారు. జిలియన్ కన్సల్టెంట్స్కు చైనీస్కు చెందిన టార్ట్సే డైరెక్టర్గా ఉన్నట్లు కూడా వెల్లడైంది. అరెస్టయిన డార్ట్సే హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. స్కాంలో మరెన్నో మోసాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications