భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలుఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువమంది చైనా వస్తువులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది నాటికి చైనా నుండి దిగుమతులు పెద్ద ఎత్తున తగ్గాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.5,020 కోట్ల పెట్టుబడితో చైనా కంపెనీలు చేపట్టాల్సిన 3 ప్రాజెక్టుల్ని ఉద్దవ్ థాకరే నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిలిపివేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు.

మూడు భారీ ఒప్పందాలు
ఈ అవగాహన ఒప్పందాల(MOU)పై పది రోజుల క్రితం సంతకాలు జరిగాయి. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కొద్దిరోజుల ముందు మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో ఉద్ధవ్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటర్స్ రూ.3,770 కోట్లతో, పీఎంఐ ఎలక్ట్రోమొబిలిటీ రూ.1,000 కోట్లతో, హెంగ్లీ ఇంజినీరింగ్ రూ.250 కోట్లతో ఈ ఒప్పందాల్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రాజెక్టులపై యథాతథ స్థితి
దీనిపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుబాష్ దేశాయ్ స్పందించారు. ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయలేదని, వాటిని హోల్డ్లో పెట్టామన్నారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేయకుండా పక్కన పెట్టామని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ మూడు ఒప్పందాలను రద్దు చేసినట్లు కాదని, ఈ ప్రాజెక్టులపై యథాతథ స్థితి కొనసాగుతుందన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

చైనా పెట్టుబడులపై...
చైనా కంపెనీలు - మహారాష్ట్ర మధ్య గ్రేట్ వాల్ మోటార్స్ (రూ.3,770 కోట్లు), పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్-ఫోటోన్(రూ.1,000 కోట్లు), హెంగ్లీ ఇంజినీరింగ్ (రూ.250 కోట్లు) ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సమాచారం రావాల్సి ఉందని, అయితే చైనా నుండి మరిన్ని పెట్టుబడులకు దూరంగా ఉంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది మహా ప్రభుత్వం.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications