భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలుఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువమంది చైనా వస్తువులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది నాటికి చైనా నుండి దిగుమతులు పెద్ద ఎత్తున తగ్గాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.5,020 కోట్ల పెట్టుబడితో చైనా కంపెనీలు చేపట్టాల్సిన 3 ప్రాజెక్టుల్ని ఉద్దవ్ థాకరే నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిలిపివేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు.

మూడు భారీ ఒప్పందాలు
ఈ అవగాహన ఒప్పందాల(MOU)పై పది రోజుల క్రితం సంతకాలు జరిగాయి. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కొద్దిరోజుల ముందు మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో ఉద్ధవ్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటర్స్ రూ.3,770 కోట్లతో, పీఎంఐ ఎలక్ట్రోమొబిలిటీ రూ.1,000 కోట్లతో, హెంగ్లీ ఇంజినీరింగ్ రూ.250 కోట్లతో ఈ ఒప్పందాల్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రాజెక్టులపై యథాతథ స్థితి
దీనిపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుబాష్ దేశాయ్ స్పందించారు. ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయలేదని, వాటిని హోల్డ్లో పెట్టామన్నారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేయకుండా పక్కన పెట్టామని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ మూడు ఒప్పందాలను రద్దు చేసినట్లు కాదని, ఈ ప్రాజెక్టులపై యథాతథ స్థితి కొనసాగుతుందన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

చైనా పెట్టుబడులపై...
చైనా కంపెనీలు - మహారాష్ట్ర మధ్య గ్రేట్ వాల్ మోటార్స్ (రూ.3,770 కోట్లు), పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్-ఫోటోన్(రూ.1,000 కోట్లు), హెంగ్లీ ఇంజినీరింగ్ (రూ.250 కోట్లు) ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సమాచారం రావాల్సి ఉందని, అయితే చైనా నుండి మరిన్ని పెట్టుబడులకు దూరంగా ఉంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది మహా ప్రభుత్వం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications